చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా కరోనా బారిన పడ్డారు. గురువారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజటివ్ వచ్చింది. గత వారం రోజులుగా ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల్లో భరత్ గుప్తా పాల్గొన్నారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్ వచ్చిన వెంటనే హోం ఐసోలేషన్కు వెళ్లిన ఆయన...ఇంట్లోనే చికిత్స తీసుకుంటానని తెలిపారు. తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఇదీచదవండి