ETV Bharat / state

కరోనా భయం: బంధువు మృతదేహం ఊరి చివరే!

author img

By

Published : Apr 30, 2020, 12:18 PM IST

Updated : Apr 30, 2020, 1:49 PM IST

కాలినడక ఊరికొచ్చిన వ్యక్తి మృతి
కాలినడక ఊరికొచ్చిన వ్యక్తి మృతి

09:31 April 30

కాలినడక ఊరికొచ్చిన వ్యక్తి మృతి

చిత్తూరు జిల్లా రామసముద్రంలో దారుణం చోటుచేసుకుంది. కరోనా లాక్​డౌన్ కారణంగా బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లా రామసముద్రానికి కాలినడకన వచ్చిన ఓ వ్యక్తి.... ఊరి శివారు ప్రాంతంలో అనారోగ్యంతో కన్నుమూశాడు. మృతుడిని రామసముద్రానికి చెందిన 28ఏళ్ల హరిప్రసాద్​గా అధికారులు గుర్తించారు. అతనికి కరోనా సోకి ఉంటుందన్న అనుమానంతో గ్రామస్తులు మృతదేహం దగ్గరికి వెళ్లేందుకు వెనుకాడారు. మృతుడి నుంచి నమూనాలు సేకరించి అధికారులు పరీక్షలు నిర్వహించగా.. కరోనా నెగటివ్ వచ్చిందని స్పష్టం చేశారు. కాలినడకన చాలా దూరం ప్రయాణించటం వలన అనారోగ్యంతో మృతి చెంది ఉంటాడని వైద్యులు ధృవీకరించారు. అనంతరం బంధువులు అతని మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. 

ఇదీ చదవండి :  స్వస్థలాలకు వెళ్లేందుకు.. కేంద్రం మార్గదర్శకాలు


 

09:31 April 30

కాలినడక ఊరికొచ్చిన వ్యక్తి మృతి

చిత్తూరు జిల్లా రామసముద్రంలో దారుణం చోటుచేసుకుంది. కరోనా లాక్​డౌన్ కారణంగా బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లా రామసముద్రానికి కాలినడకన వచ్చిన ఓ వ్యక్తి.... ఊరి శివారు ప్రాంతంలో అనారోగ్యంతో కన్నుమూశాడు. మృతుడిని రామసముద్రానికి చెందిన 28ఏళ్ల హరిప్రసాద్​గా అధికారులు గుర్తించారు. అతనికి కరోనా సోకి ఉంటుందన్న అనుమానంతో గ్రామస్తులు మృతదేహం దగ్గరికి వెళ్లేందుకు వెనుకాడారు. మృతుడి నుంచి నమూనాలు సేకరించి అధికారులు పరీక్షలు నిర్వహించగా.. కరోనా నెగటివ్ వచ్చిందని స్పష్టం చేశారు. కాలినడకన చాలా దూరం ప్రయాణించటం వలన అనారోగ్యంతో మృతి చెంది ఉంటాడని వైద్యులు ధృవీకరించారు. అనంతరం బంధువులు అతని మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. 

ఇదీ చదవండి :  స్వస్థలాలకు వెళ్లేందుకు.. కేంద్రం మార్గదర్శకాలు


 

Last Updated : Apr 30, 2020, 1:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.