తమిళనాడు దొంగలు అరెస్ట్. చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేసినట్లు పుత్తూరు డీఎస్పీ మురళీధర్ వెల్లడించారు. వారు తమిళనాడుకు చెందిన తండ్రీకుమారులు కుమార్రెడ్డి, విశాల్లుగా పేర్కొన్నారు. నిందితుల నుంచి 145 గ్రాముల బంగారం, ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు ఛేదనకు సహకరించిన సిబ్బందిని అభినందించారు.ఇవీ చదవండి....చిత్తూరు పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగ