ETV Bharat / state

వసతిగృహం వీడిన విద్యార్థుల ఆచూకీ లభ్యం

చిత్తూరు జిల్లా బాలుర బీసీ వసతి గృహం నుంచి వెళ్లిపోయిన ముగ్గురు విద్యార్దులు కాసేపు కంగారు పెట్టించారు. విద్యార్ధులు వారి స్వస్థలాలకు చేరుకున్నట్లు గుర్తించిన పోలీసులు, విద్యార్దులు, వారి తల్లిదండ్రులు, వార్డెన్ లను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి వేశారు.

author img

By

Published : Sep 13, 2019, 6:01 PM IST

విద్యార్థులు
వసతిగృహం నుంచి వెళ్లిపోయిన విద్యార్థుల ఆచూకీ లభ్యం

చిత్తూరు జిల్లా పలమనేరులో బీసీ బాలుర వసతి గృహం నుంచి వెళ్లిపోయిన తొమ్మిదోతరగతి విద్యార్థుల ఆచూకీని పోలీసులు గుర్తించారు. గురువారం వసతిగృహంలో అల్పాహారం తీసుకున్న తరువాత విద్యార్దులు ఆచూకీ లేకుండా పోయారు. దీంతో ప్రధానోపాధ్యాయురాలు రుక్మిణమ్మ వార్డెన్ సురేష్ కు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్ధులను వెతికేందుకు ప్రత్యేక బృందాలుగా దిగిన పోలీసులు విద్యార్థులు వారి స్వస్థలాలకు చేరుకున్నట్లు గుర్తించారు. ఈ ఘటనతో పోలీసులు విద్యార్థులను, తల్లిదండ్రులను, ప్రధానోపాధ్యాయురాలు, వార్డెన్ ను స్టేషన్ కు పిలిపించారు. అందరి సమక్షంలో పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చి వార్డెన్ కు అప్పగించారు

వసతిగృహం నుంచి వెళ్లిపోయిన విద్యార్థుల ఆచూకీ లభ్యం

చిత్తూరు జిల్లా పలమనేరులో బీసీ బాలుర వసతి గృహం నుంచి వెళ్లిపోయిన తొమ్మిదోతరగతి విద్యార్థుల ఆచూకీని పోలీసులు గుర్తించారు. గురువారం వసతిగృహంలో అల్పాహారం తీసుకున్న తరువాత విద్యార్దులు ఆచూకీ లేకుండా పోయారు. దీంతో ప్రధానోపాధ్యాయురాలు రుక్మిణమ్మ వార్డెన్ సురేష్ కు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్ధులను వెతికేందుకు ప్రత్యేక బృందాలుగా దిగిన పోలీసులు విద్యార్థులు వారి స్వస్థలాలకు చేరుకున్నట్లు గుర్తించారు. ఈ ఘటనతో పోలీసులు విద్యార్థులను, తల్లిదండ్రులను, ప్రధానోపాధ్యాయురాలు, వార్డెన్ ను స్టేషన్ కు పిలిపించారు. అందరి సమక్షంలో పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చి వార్డెన్ కు అప్పగించారు

.

ఇది కూడా చదవండి.

తితిదే పాలకమండలి సభ్యుల సంఖ్య పెంపు..ఆర్డినెన్స్ జారీ

Intro:భోగాపురం వ్యవసాయ కమిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం హాజరైన ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు


Body:విజయనగరం జిల్లా భోగాపురం మండలం లో మొక్కల నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు ప్రారంభించారు వ్యవసాయ శాఖ ఉపాధి హామీ శాఖల ఆధ్వర్యంలో శాఖల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదు వందల ముక్కలను 30 రోజుల్లో నాటించారు వీటిని భోగాపురం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో వేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని హాని కలిగించే వాయువుల్ని మొక్కల పెంపకం ద్వారా మేలు జరుగుతుందని తెలిపారు నియోజకవర్గంలో లక్ష మొక్కలను చేసేందుకు ప్రణాళికలు చేపట్టామని ఇందులో అందరూ భాగస్వాములు కావాలని కోరారు జగన్మోహన్రెడ్డి పాలనలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు కరమైన పథకాలు అందించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేశామన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పువ్వాడ సూర్యనారాయణ డిసిసిబి డైరెక్టర్ సుందర గోవిందరావు మాజీ జడ్పిటిసి బైరెడ్డి ప్రభాకర్ రావు తాసిల్దారు అప్పలనాయుడు ఎంపీడీవో ప్రకాశరావు వ్యవసాయ శాఖ ఏడీ శ్రీనివాసరావు తదితర అధికారులు నాయకులు పాల్గొన్నారు


Conclusion:భోగాపురం న్యూస్ టుడే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.