ETV Bharat / state

తిరుపతి కాంగ్రెస్​కు కంచుకోట: తులసిరెడ్డి

author img

By

Published : Mar 13, 2021, 2:56 PM IST

భాజపా, వైకాపా, తెదేపాలపై కాంగ్రెస్ నేత తులసి రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికలో ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు వారికి లేదని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.

thulasireddy
తులసి రెడ్డి

తిరుపతి లోక్​సభ కాంగ్రెస్​కు కంచుకోట అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే.. 12 సార్లు కాంగ్రెస్​ జెండా ఎగరేసిందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో భాజపా వెంకటేశ్వర స్వామినే మోసం చేసిందన్నారు. భాజపా మోసగారితనం, వైకాపా, తెదేపా.. చేతగానితనం వల్లే ప్రత్యేక హోదా రాలేదని ధ్వజమెత్తారు. రాయలసీమకు బుందేల్​ఖండ్ తరహాలో ప్యాకేజీ, దుగ్గరాజపట్నం మేజర్ ఓడరేవు రాలేదనీ.. మన్నవరం ఫ్యాక్టరీ మూతబడిందని వివరించారు. భాజపా, వైకాపా, తెదేపాలకు తిరుపతి లోక్​సభ ఓటర్లను ఓటు అడిగే నైతిక హక్కు లేదని తులసిరెడ్డి పేర్కొన్నారు.

తిరుపతి లోక్​సభ కాంగ్రెస్​కు కంచుకోట అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే.. 12 సార్లు కాంగ్రెస్​ జెండా ఎగరేసిందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో భాజపా వెంకటేశ్వర స్వామినే మోసం చేసిందన్నారు. భాజపా మోసగారితనం, వైకాపా, తెదేపా.. చేతగానితనం వల్లే ప్రత్యేక హోదా రాలేదని ధ్వజమెత్తారు. రాయలసీమకు బుందేల్​ఖండ్ తరహాలో ప్యాకేజీ, దుగ్గరాజపట్నం మేజర్ ఓడరేవు రాలేదనీ.. మన్నవరం ఫ్యాక్టరీ మూతబడిందని వివరించారు. భాజపా, వైకాపా, తెదేపాలకు తిరుపతి లోక్​సభ ఓటర్లను ఓటు అడిగే నైతిక హక్కు లేదని తులసిరెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఏ మెుహం పెట్టుకుని ఓట్లు అడగుతారు?: సీపీఐ రామకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.