ETV Bharat / state

తెలంగాణవాసిపై కాల్పులు

అమెరికాలోని ఫ్లోరిడాలో తెలంగాణవాసిని బలితీసుకున్నారు దుండగులు. డిపార్ట్​మెంటల్​ స్టోర్​లోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. హైదరాబాద్​ ఉప్పల్​లో నివసిస్తున్న మృతుని కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు.

author img

By

Published : Feb 20, 2019, 11:57 PM IST

అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన మృతుడి కుటుంబం

అమెరికాలో దుండగులు రెచ్చిపోయారు. తెలంగాణకు చెందిన వ్యక్తిని బలి తీసుకున్నారు.ఫ్లోరిడాలోని డిపార్టుమెంటల్​స్టోర్​లోకి చొరబడి తుపాకులతో తెగబడ్డారు. ఈ కాల్పుల్లో తెలంగాణ వాసి కొత్త గోవర్ధన్​రెడ్డి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

ఏడేళ్ల క్రితం ఉద్యోగరీత్యా ఫ్లోరీడాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు గోవర్ధన్​రెడ్డి. డిపార్టుమెంటల్ స్టోర్​లో మేనేజర్​గా విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్యాపిల్లలు హైదరాబాద్ ఉప్పల్​లో నివసిస్తున్నారు.గోవర్ధన్​రెడ్డి మరణవార్తవిని శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అమెరికాలో దుండగులు రెచ్చిపోయారు. తెలంగాణకు చెందిన వ్యక్తిని బలి తీసుకున్నారు.ఫ్లోరిడాలోని డిపార్టుమెంటల్​స్టోర్​లోకి చొరబడి తుపాకులతో తెగబడ్డారు. ఈ కాల్పుల్లో తెలంగాణ వాసి కొత్త గోవర్ధన్​రెడ్డి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

ఏడేళ్ల క్రితం ఉద్యోగరీత్యా ఫ్లోరీడాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు గోవర్ధన్​రెడ్డి. డిపార్టుమెంటల్ స్టోర్​లో మేనేజర్​గా విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్యాపిల్లలు హైదరాబాద్ ఉప్పల్​లో నివసిస్తున్నారు.గోవర్ధన్​రెడ్డి మరణవార్తవిని శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండిమసూద్​పై ఫ్రాన్స్ గురి

Intro:filename:

tg_adb_02_02_bavilo_padi_iddaru_baluru_mruthi_av_c11


Body:కుమురం భీం జిల్లా కౌటాల మండలం నాగేపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు బావిలోపడి మృతిచెందారు. మోర్లే సురేష్, మోర్లే చంద్రు ఇద్దరు అన్నదమ్ములు. ఇద్దరూ అన్నదమ్ములకు ముగ్గురు ముగ్గురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. కాగా విజయ నగరం లోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో చదువుకుంటున్న ఇద్దరు బాలురు ఈ రోజు సంత్ సేవాలాల్ జయంతి సందర్బంగా పాఠశాలకు సెలవు ప్రకటించడంతో అమ్మానాన్నలతో కలిసి పొలానికి వెళ్లారు. తల్లితండ్రులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా ఇద్దరు అబ్బాయిలు ఆడుకుంటూ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు పడిపోయి నీటమునిగారు. పిల్లలిద్దరూ ఎంతకూ కనిపించకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు బావివద్దకు వచ్చి చూడగా బాలూరిద్దరు విగతాజీవులుగా కనిపించారు. అప్పటివరకు తమతోనే ఉన్నపిల్లలు కానరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

******
విజువల్స్ ఈటీవీ ఎఫ్టిపిలో పంపడమైనది గమనించగలరు


Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO 641

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.