ETV Bharat / state

వేసవి శిక్షణ..భవితకు నిచ్చెన - undefined

రోజూ పుస్తకాల సంచి భుజానికి వేసి బడి బాట పట్టిన  చిన్నారులు..కాలికి గజ్జ కట్టి శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటున్నారు. విజయవాడ పెనమలూరు పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మంది చిన్నారులు కూచిపూడి, భరతనాట్యం వంటి నృత్యాలు ఆసక్తిగా నేర్చుకుంటున్నారు

వేసవి శిక్షణ..భవితకు నిచ్చెన
author img

By

Published : May 12, 2019, 8:47 AM IST

వేసవి శిక్షణ..భవితకు నిచ్చెన
చిట్టిపొట్టి చిన్నారులు రూటు మార్చారు. కాలికి గజ్జ కట్టి శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటున్నారు. సంగీత పాఠశాలలో సంస్కృత పాఠాలు వల్లె వేస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాలు నేటి తరాని అలవర్చటమే లక్ష్యంగా తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు ప్రోత్సహిస్తున్నారు.
విజయవాడలోని పెనమలూరు చిన్నారులు మొన్నటి వరకు పుస్తకాలు పట్టి సెలవుల్లో వాటి జోలికే పోవడం లేదు. సంగీతం, నృత్యం సాధన చేస్తూ బిజిబిజీగా మారిపోయారు.
ఎమ్మెల్యే సహకారంతో...
నేటితరం పిల్లలకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, సంగీతం, నృత్యాన్ని అలవర్చాలన్న ఉద్దేశంతో విజయవాడకు చెందిన నాట్య గురువు ఎడం నరేంద్ర కుమార్..20 ఏళ్లుగా వీటిని నేర్పిస్తున్నారు. పిల్లలకు వారి ఆసక్తిని బట్టి భరతనాట్యం, కూచిపూడి, జానపదకళల్లో తర్ఫీదునిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం పోరంకిలో చిన్నపాటి గది అద్దెకు తీసుకుని పిల్లలకు నాట్యం నేర్పించేవారు. శిష్యుల సంఖ్య పెరిగి ఇబ్బంది పడుతున్న ఆయన పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్... తన కార్యాలయంలోని షెడ్‌ను అప్పగించారు. శిక్షణ కోసం కావాల్సిన మౌలిక వసతులు కల్పించారు.
ఈ తరహా శిక్షణతో ఎంతో ప్రయోజనం ఉంటుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. పిల్లల్లో మానసిక వికాసం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
ప్రాచీన కళలు నేటి తరానికి అందించాలనే లక్ష్యంతోనే వేసవిలో ఈ తరహా శిక్షణ కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.

వేసవి శిక్షణ..భవితకు నిచ్చెన
చిట్టిపొట్టి చిన్నారులు రూటు మార్చారు. కాలికి గజ్జ కట్టి శాస్త్రీయ నృత్యం నేర్చుకుంటున్నారు. సంగీత పాఠశాలలో సంస్కృత పాఠాలు వల్లె వేస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాలు నేటి తరాని అలవర్చటమే లక్ష్యంగా తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు ప్రోత్సహిస్తున్నారు.
విజయవాడలోని పెనమలూరు చిన్నారులు మొన్నటి వరకు పుస్తకాలు పట్టి సెలవుల్లో వాటి జోలికే పోవడం లేదు. సంగీతం, నృత్యం సాధన చేస్తూ బిజిబిజీగా మారిపోయారు.
ఎమ్మెల్యే సహకారంతో...
నేటితరం పిల్లలకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, సంగీతం, నృత్యాన్ని అలవర్చాలన్న ఉద్దేశంతో విజయవాడకు చెందిన నాట్య గురువు ఎడం నరేంద్ర కుమార్..20 ఏళ్లుగా వీటిని నేర్పిస్తున్నారు. పిల్లలకు వారి ఆసక్తిని బట్టి భరతనాట్యం, కూచిపూడి, జానపదకళల్లో తర్ఫీదునిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం పోరంకిలో చిన్నపాటి గది అద్దెకు తీసుకుని పిల్లలకు నాట్యం నేర్పించేవారు. శిష్యుల సంఖ్య పెరిగి ఇబ్బంది పడుతున్న ఆయన పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్... తన కార్యాలయంలోని షెడ్‌ను అప్పగించారు. శిక్షణ కోసం కావాల్సిన మౌలిక వసతులు కల్పించారు.
ఈ తరహా శిక్షణతో ఎంతో ప్రయోజనం ఉంటుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. పిల్లల్లో మానసిక వికాసం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
ప్రాచీన కళలు నేటి తరానికి అందించాలనే లక్ష్యంతోనే వేసవిలో ఈ తరహా శిక్షణ కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.
Hubli (Karnataka), May 10 (ANI): Former chief minister of Karnataka and Bharatiya Janata Party (BJP) leader BS Yeddyurappa claimed that "More than 20 Congress MLAs are not happy with the present Karnataka government, they might take any decision at any time". He said, 'Let us wait and see'. He further added "Law and order situation is completely collapsed".

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.