ETV Bharat / state

రెవెన్యూ, గృహనిర్మాణ శాఖలపై మంత్రుల సమీక్ష

author img

By

Published : Jul 18, 2019, 9:15 PM IST

అమరావతిలోని సచివాలయంలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల ఉమ్మడి సమావేశం జరిగింది. ఈ భేటీకి మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, శ్రీరంగనాథ రాజు హాజరయ్యారు. బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు నిర్మాణాలపై మంత్రులు సమీక్షించారు.

పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు... బలహీనవర్గాల ప్రజలకు ఉగాది రోజు 25 లక్షల ఇళ్ల పట్టాలిస్తామని మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రకటించారు. గ్రామాల్లో స్థల సేకరణపై అధికారులతో చర్చించామన్న మంత్రి సుభాష్‌ చంద్రబోస్‌... ప్రస్తుతం 11,140 ఎకరాల ప్రభుత్వ స్థలాలున్నాయని అధికారులు తెలిపారన్నారు. గ్రామాల్లో స్థలాలను పరిశీలించాలని కలెక్టర్లు, తహసీల్దార్లను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఇళ్ల స్థలాల కోసం ఇప్పటి వరకు 26,75,384 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. గ్రామాల్లో స్థలాలు కొనేందుకు రైతులను ఒప్పించాలని కోరినట్లు పేర్కొన్నారు.

25 లక్షల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించామని మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. ప్రభుత్వం నుంచి రూ.2 లక్షలు రుణం ఇప్పించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. బ్యాంకుల నుంచి రూ.4 లక్షల వరకు రుణం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. ఇంటి స్థలం తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణం తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

ఇదీ చదవండీ... సీఎం జగన్​తో మేజర్ జనరల్ భేటీ

పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు... బలహీనవర్గాల ప్రజలకు ఉగాది రోజు 25 లక్షల ఇళ్ల పట్టాలిస్తామని మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రకటించారు. గ్రామాల్లో స్థల సేకరణపై అధికారులతో చర్చించామన్న మంత్రి సుభాష్‌ చంద్రబోస్‌... ప్రస్తుతం 11,140 ఎకరాల ప్రభుత్వ స్థలాలున్నాయని అధికారులు తెలిపారన్నారు. గ్రామాల్లో స్థలాలను పరిశీలించాలని కలెక్టర్లు, తహసీల్దార్లను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఇళ్ల స్థలాల కోసం ఇప్పటి వరకు 26,75,384 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. గ్రామాల్లో స్థలాలు కొనేందుకు రైతులను ఒప్పించాలని కోరినట్లు పేర్కొన్నారు.

25 లక్షల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించామని మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. ప్రభుత్వం నుంచి రూ.2 లక్షలు రుణం ఇప్పించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. బ్యాంకుల నుంచి రూ.4 లక్షల వరకు రుణం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. ఇంటి స్థలం తనఖా పెట్టి బ్యాంకుల నుంచి రుణం తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

ఇదీ చదవండీ... సీఎం జగన్​తో మేజర్ జనరల్ భేటీ

Intro:ap_vja_52_18_iiit_chanchalar_press_meet_avb_ap 10122. కృష్ణాజిల్లా నూజివీడు. స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనలో భాగంగా త్రిబుల్ ఐటీ లో సంస్కరించినట్లే రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కెసి రెడ్డి అన్నారు నూజివీడు త్రిబుల్ ఐటీ నేడు సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ త్రిబుల్ ఐటీ లు డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రిక అని తెలిపారు పరిపాలన ఆర్థిక లావాదేవీలు అవకతవకలు ఉంటే సహించేది లేదని హెచ్చరించారు vc నుండి సాధారణ అటెండర్ వరకు అందరు సమానమే అని అన్నారు త్రిబుల్ ఐటీ ఏర్పడిన 11 సంవత్సరాలు అయ్యాయి ఎక్కడ మిక్ అడ్మినిస్ట్రేటివ్ ఎకనామిక్ ఆడిట్ జరుపుతామన్నారు మిగిలిన విశ్వవిద్యాలయ లాగా ఆర్.జి కేటి కాదని ఇది ఒక విశిష్టమైన విశ్వవిద్యాలయం అని ప్రగతి గల పేద విద్యార్థుల కలలు సహకారానికి సువర్ణ నిలయం అని అన్నారు సదాశయంతో ఇక్కడ అడుగుపెట్టిన విద్యార్థి ఎన్నో ఆశయాలను సాధించి మరి వెలుగుతూ ఉంటారని అన్నారు. బైట్స్. 1) కెసి రెడ్డి ఛాన్స్లర్ త్రిబుల్ ఐటీ లు. ( సర్ కృష్ణా జిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810. ఫోన్ నెంబర్. 8008020314)


Body:కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో కెసి రెడ్డి ప్రెస్ మీట్


Conclusion:కృష్ణాజిల్లా నూజివీడు కెసి రెడ్డి ప్రెస్ మీట్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.