ETV Bharat / state

చంద్రబాబు కోసం మా ఇళ్లు ఇస్తాం.. రైతులు

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అమరావతికి దూరం చేయాలన్న దురుద్దేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని రాజధాని ప్రాంత రైతులు అన్నారు. ఆయన్న రాజధానికి దూరం చేయడానికే నివాసం అక్రమమంటూ నోటీసులిచ్చారని ఆరోపించారు. మా ఇంట్లో చోటిస్తామంటూ.. చంద్రబాబు నివాసం వద్దకు రైతులు తరలివచ్చారు.

author img

By

Published : Jun 28, 2019, 5:42 PM IST

చంద్రబాబు రాజధానిలోనే ఉండాలి
చంద్రబాబు కోసం మా ఇళ్లు ఇస్తాం.. రైతులు

రాజధానిలో రాజకీయం వేడెక్కుతోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇళ్లు అక్రమ కట్టడం అంటూ.. రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని తాఖీదులు గోడకు అంటించింది. రాష్ట్ర ప్రభుత్వానిది దుందుడుకు చర్య అంటూ తెదేపా మండిపడింది. దురుద్దేశపూర్వకంగానే నోటీసులు ఇస్తున్నారని ఆరోపిస్తోంది.

బాబు మాతోనే ఉండాలి..
ఇవాళ ఉదయం సీఆర్డీఏ నోటీసులు ఇవ్వగా.. మధ్యాహ్నానికి రాజధాని రైతులు చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు. వెలగపూడి, తుళ్లూరు గ్రామాల నుంచి వచ్చిన రైతులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. చంద్రబాబును రాజధాని ప్రాంతం నుంచి బయటకు పంపించి వేయాలన్న దురుద్దేశంతోనే నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. బాబు తమతోనే ఉండాలని కోరారు. అవసరమైతే.. తమ స్థలాన్ని చంద్రబాబుకు ఇస్తామని.. ఇప్పటికే నిర్మించుకున్న ఇళ్లల్లో అయినా చోటిస్తామని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చూస్తుంటే.. అమరావతిని అభివృద్ధి చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

ఇవీ చదవండి...చంద్రబాబు నివాసానికి సీఆర్డీఏ నోటీసులు

చంద్రబాబు కోసం మా ఇళ్లు ఇస్తాం.. రైతులు

రాజధానిలో రాజకీయం వేడెక్కుతోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇళ్లు అక్రమ కట్టడం అంటూ.. రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని తాఖీదులు గోడకు అంటించింది. రాష్ట్ర ప్రభుత్వానిది దుందుడుకు చర్య అంటూ తెదేపా మండిపడింది. దురుద్దేశపూర్వకంగానే నోటీసులు ఇస్తున్నారని ఆరోపిస్తోంది.

బాబు మాతోనే ఉండాలి..
ఇవాళ ఉదయం సీఆర్డీఏ నోటీసులు ఇవ్వగా.. మధ్యాహ్నానికి రాజధాని రైతులు చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు. వెలగపూడి, తుళ్లూరు గ్రామాల నుంచి వచ్చిన రైతులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. చంద్రబాబును రాజధాని ప్రాంతం నుంచి బయటకు పంపించి వేయాలన్న దురుద్దేశంతోనే నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. బాబు తమతోనే ఉండాలని కోరారు. అవసరమైతే.. తమ స్థలాన్ని చంద్రబాబుకు ఇస్తామని.. ఇప్పటికే నిర్మించుకున్న ఇళ్లల్లో అయినా చోటిస్తామని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చూస్తుంటే.. అమరావతిని అభివృద్ధి చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

ఇవీ చదవండి...చంద్రబాబు నివాసానికి సీఆర్డీఏ నోటీసులు

Intro:స్క్రిప్ట్ కడప జిల్లా రాయచోటి వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలోని వినాయకుడు ఘోర లింగేశ్వరుడు సుబ్రహ్మణ్యస్వామ భైరవేశ్వర డు ఆలయాలతోపాటు వీరభద్రుడు భద్రకాళి దేవి అమ్మవారి ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం పదిన్నర గంటలకు భద్రకాళి దేవాలయం ఎదుట ప్రధాన అర్చకులు కృష్ణయ్య స్వామి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయం ఎదుట రాహుకాల పూజ నిర్వహించారు ఈ పూజలకు స్థానిక కన్నడ భక్తులు భారీగా తరలివచ్చి పూజలు నిర్వహించారు అమ్మవారికి పసుపు కుంకుమ పూలు పండ్లు సమర్పించి కుంకుమార్చనలు చేసి మంగళ హారతులు ఇచ్చారు భక్తులకు రాహుకాల పూజ విశిష్టతను అర్చకులు తెలియజేశారు కార్యక్రమంలో లో ఆలయఈవో టి మంజుల సిబ్బంది భక్తులు పాల్గొన్నారు


Body:ఓన్లీ విజువల్స్


Conclusion:ఓన్లీ విజువల్స్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.