ETV Bharat / state

నీటి కోసం.. రెండు గ్రామాల మధ్య యుద్ధం - గ్రామాల మధ్య నీటి వివాదం వార్తలు

అనంతపురం జిల్లా రామచంద్రాపురం గ్రామం వద్ద నీటి కోసం తలెత్తిన వాగ్వాదం.. ఉద్రిక్తతకు దారి తీసింది. చెరువులకు నీటి విడుదల విషయమై కూడేరు మండలం, రామచంద్రాపురం గ్రామం - గార్లదిన్నె మండలం, కోటంక గ్రామ రైతుల మధ్య వివాదం.. ఘర్షణగా మారింది.

water issue between two villages in ananthapur district
నీటి కోసం గ్రామల మధ్య యుద్ధం
author img

By

Published : Mar 23, 2020, 11:21 AM IST

నీటి కోసం గ్రామల మధ్య యుద్ధం

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని కోటంక గ్రామస్తులు.. నీటి విడుదల కోసం రామచంద్రాపురం వెళ్లారు. నీరు వదిలేది లేదని రామచంద్రాపురం రైతులు తెగేసి చెప్పారు. రెండు గ్రామాల ప్రజల మధ్య వాగ్వాదం జరిగింది. కూడేరు మండల పరిధిలోని రామచంద్రాపురం చెరువు నుంచి శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలంలోని.. కోటంక గ్రామంలోని చెరువుకు నీటిని తీసుకుపోవడానికి తాము ఒప్పుకోబోమని రామచంద్రాపురం రైతులు ఇరిగేషన్ అధికారులకు తెగేసి చెప్పారు. నీటిని విడుదల చేసేందుకు వచ్చిన ఇరిగేషన్​ అధికారులను అడ్డుకున్నారు. ఈ కారణంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. గ్రామస్తులకు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

నీటి కోసం గ్రామల మధ్య యుద్ధం

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని కోటంక గ్రామస్తులు.. నీటి విడుదల కోసం రామచంద్రాపురం వెళ్లారు. నీరు వదిలేది లేదని రామచంద్రాపురం రైతులు తెగేసి చెప్పారు. రెండు గ్రామాల ప్రజల మధ్య వాగ్వాదం జరిగింది. కూడేరు మండల పరిధిలోని రామచంద్రాపురం చెరువు నుంచి శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలంలోని.. కోటంక గ్రామంలోని చెరువుకు నీటిని తీసుకుపోవడానికి తాము ఒప్పుకోబోమని రామచంద్రాపురం రైతులు ఇరిగేషన్ అధికారులకు తెగేసి చెప్పారు. నీటిని విడుదల చేసేందుకు వచ్చిన ఇరిగేషన్​ అధికారులను అడ్డుకున్నారు. ఈ కారణంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. గ్రామస్తులకు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

ఇదీ చదవండి:

చెరువులు నింపాలని పరిగి రైతుల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.