ETV Bharat / state

Donkey cart: పెట్రో ధరలతో.. వాహనం వీడి గాడిద బండి పట్టిన దోబీ..!

అతను కులవృత్తిని నమ్ముకున్నాడు.! ఏదో తనకున్న డబ్బుతో చిన్న మోపెడ్‌ కొనుక్కుని.. పని చేసుకుంటున్నాడు.! సాఫీగా సాగిపోతున్న అతని జీవన ప్రయాణానికి.. పెట్రో సెగ తగిలింది. మోపెడ్‌పై తిరిగిన అతని బతుకు జట్కా బండైంది. పెట్రోలు ధరల దెబ్బకు.. మోటారు వాహనాన్ని మూలనపడేసి.. గాడిదను నమ్ముకున్నారు ఓ దోబీ. ఇది సరదా సవారీ కాదు.! పరిస్థితులు అతన్ని.. జట్కాబండెక్కించాయి.

author img

By

Published : Jun 20, 2021, 12:34 PM IST

Updated : Jun 20, 2021, 3:06 PM IST

washerman purchased donkey cart for his work
వాహనానం వీడి గాడిద బండి పట్టిన దోబీ..!
పెట్రో ధరలతో.. వాహనానం వీడి గాడిద బండి పట్టిన దోబీ

అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన సురేశ్ వృత్తిరీత్యా దోబీ పని చేస్తారు. ఇళ్లకు వెళ్లి దుస్తులు సేకరించడం, చాకిరేవుకు తీసుకెళ్లి వాటిని ఉతికి మళ్లీ ఎవరివి వారికి తిరిగి అప్పగిస్తారు. మొత్తం మీద రోజూ పాతిక కిలోమీటర్ల వరకూ తిరగాల్సివస్తుంది. దుస్తుల మూటలు మోస్తూ.. అంతదూరం తిరగలేక ఓ టీవీఎస్‌ మోపెడ్‌ కొనుక్కున్నారు సురేశ్‌. సెంచరీకొట్టిన పెట్రోలు దెబ్బకు.. ఇప్పుడా వాహనాన్ని మూలనపడేసి ఓ ఈగాడిదను నమ్ముకున్నారు.

మోపెడ్‌ అయితే అప్పోసొప్పో చేసి కొన్నానుగానీ.. అందులో పెట్రోలు పోయించడానికి స్థోమత సరిపోవడంలేదంటున్నారు సురేశ్‌. రోజూ నాకొచ్చేదే వంద, ఆ వందా పెట్రోల్‌కే వెచ్చిస్తే ఇక నేనేంతినాలి.. భార్యబిడ్డలకేంపెట్టాలి అంటారాయన. అందుకే ఓ గాడిదను కొనేశారు. దాని కోసం జట్కాబండి తయారు చేయించారు. ఇది కూడా చౌకేం కాదంటారు సురేశ్‌. గాడిద ఖరీదు రూ.16 వేలని, బండి తయారీకి మరో రూ. 10వేలు ఖర్చైందని తెలిపారు.

'సురేశ్‌ ఆలోచనను తోటిదోబీలూ అభినందిస్తున్నారు. తామూ అలా చేద్దామంటే.. గాడిదల ధరలూ పెరిగిపోయాయంటున్నారు. ప్రభుత్వాలెలాగూ.. పెట్రోలు ధరలు తగ్గించలేవుగానీ గాడిదలైనా కాస్త తక్కువ ధరకు ఇప్పించి పుణ్యంకట్టుకోవాలి'. -రమేశ్‌, రజకుడు

గాడిద బండిపై సవారీ చేస్తున్న సురేశ్‌ను ప్రజలు వింతగా చూస్తున్నారు. ఐనా అదేం తనకు నామోషీ కాదంటున్నారాయన. పెట్రోలు ఊరికే రాదు కదా అంటూ.. ఎదురు ప్రశ్నేశారు. తన వరకూ రవాణా ఖర్చులు ఆదా అయ్యాయంటూ.. తన పనిచేసుకుంటూ సాగిపోతున్నారు.

ఇవీ చదవండి:

డోలీ కట్టి వర్షంలోనే గర్భిణీ తరలింపు

'నవ ప్రభుత్వ కర్తవ్యాలు' పేరుతో జగన్‌కు ఎంపీ రఘురామ లేఖ

పెట్రో ధరలతో.. వాహనానం వీడి గాడిద బండి పట్టిన దోబీ

అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన సురేశ్ వృత్తిరీత్యా దోబీ పని చేస్తారు. ఇళ్లకు వెళ్లి దుస్తులు సేకరించడం, చాకిరేవుకు తీసుకెళ్లి వాటిని ఉతికి మళ్లీ ఎవరివి వారికి తిరిగి అప్పగిస్తారు. మొత్తం మీద రోజూ పాతిక కిలోమీటర్ల వరకూ తిరగాల్సివస్తుంది. దుస్తుల మూటలు మోస్తూ.. అంతదూరం తిరగలేక ఓ టీవీఎస్‌ మోపెడ్‌ కొనుక్కున్నారు సురేశ్‌. సెంచరీకొట్టిన పెట్రోలు దెబ్బకు.. ఇప్పుడా వాహనాన్ని మూలనపడేసి ఓ ఈగాడిదను నమ్ముకున్నారు.

మోపెడ్‌ అయితే అప్పోసొప్పో చేసి కొన్నానుగానీ.. అందులో పెట్రోలు పోయించడానికి స్థోమత సరిపోవడంలేదంటున్నారు సురేశ్‌. రోజూ నాకొచ్చేదే వంద, ఆ వందా పెట్రోల్‌కే వెచ్చిస్తే ఇక నేనేంతినాలి.. భార్యబిడ్డలకేంపెట్టాలి అంటారాయన. అందుకే ఓ గాడిదను కొనేశారు. దాని కోసం జట్కాబండి తయారు చేయించారు. ఇది కూడా చౌకేం కాదంటారు సురేశ్‌. గాడిద ఖరీదు రూ.16 వేలని, బండి తయారీకి మరో రూ. 10వేలు ఖర్చైందని తెలిపారు.

'సురేశ్‌ ఆలోచనను తోటిదోబీలూ అభినందిస్తున్నారు. తామూ అలా చేద్దామంటే.. గాడిదల ధరలూ పెరిగిపోయాయంటున్నారు. ప్రభుత్వాలెలాగూ.. పెట్రోలు ధరలు తగ్గించలేవుగానీ గాడిదలైనా కాస్త తక్కువ ధరకు ఇప్పించి పుణ్యంకట్టుకోవాలి'. -రమేశ్‌, రజకుడు

గాడిద బండిపై సవారీ చేస్తున్న సురేశ్‌ను ప్రజలు వింతగా చూస్తున్నారు. ఐనా అదేం తనకు నామోషీ కాదంటున్నారాయన. పెట్రోలు ఊరికే రాదు కదా అంటూ.. ఎదురు ప్రశ్నేశారు. తన వరకూ రవాణా ఖర్చులు ఆదా అయ్యాయంటూ.. తన పనిచేసుకుంటూ సాగిపోతున్నారు.

ఇవీ చదవండి:

డోలీ కట్టి వర్షంలోనే గర్భిణీ తరలింపు

'నవ ప్రభుత్వ కర్తవ్యాలు' పేరుతో జగన్‌కు ఎంపీ రఘురామ లేఖ

Last Updated : Jun 20, 2021, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.