బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి విక్రయించారన్న ఆరోపణల వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ఊపందుకుంది. ఈ కేసులో ఆర్టీఏ ఏజెంట్ బి.రవికుమార్ను తాడిపత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, తెదేపా నాయకుడు జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్రెడ్డిలను అరెస్టు చేసి విచారించారు. వీరి రిమాండును జులై 1 వరకూ పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చూడండి..