అనంతపురం జిల్లా గుంతకల్లులో అదృశ్యమైన బాలికల ఆచూకీ లభ్యమైంది. 3 రోజుల కిందట పాఠశాలకు వెళ్లిన జబినా, గౌసియాలు తిరిగి ఇంటికి రాకపోవటంతో... తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు... గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ పుటేజీ ఆధారంగా ఆచూకీ కనుగొన్నారు. కర్ణాటకలోని గుల్బర్గా-వాడి స్టేషన్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం తెలిసింది. అక్కడినుంచి వారిని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఇవీ చదవండి