ఓ మతిస్థిమితం లేని కొడుకుపై సవతితల్లి ప్రతాపం చూపించింది. తన సొంత కొడుకుతో కలిసి..ఆమె భర్త, కొడుకుపై దాడి చేసింది. కుటుంబ కలహాల కారణంగా సవతి తల్లి కొడుకుపై దాడి చేసింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన నారప్పకు మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య కొడుకు మధు మానసిక దివ్యాంగుడు.
కుటుంబ కలహాల కారణంగా సవతి తల్లి ఆమె కొడుకు కలిసి.. మొదటి భార్య కొడుకైన మధు, భర్త నారప్పను తలపై కర్రలతో కొట్టారు. ఈ ఘటనలో వారిద్దరికి గాయాలయ్యాయి. వీరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కొడుకు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి. సూర్య గ్రహణం కారణంగా ఆదివారం శ్రీవారి దర్శనం రద్దు