ETV Bharat / state

ఆర్టీసీ బస్సు బోల్తా..నలుగురు ప్రయాణికులకు గాయాలు

author img

By

Published : Jun 18, 2022, 9:51 PM IST

అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్​కు అస్వస్థతతో బస్సు పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఉపిరి పీల్చుకున్నారు.

ఆర్టీసీ బస్సు బోల్తా
ఆర్టీసీ బస్సు బోల్తా

అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. కంబదూరు నుంచి అనంతపురం వెళ్తున్న అనంతపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చిన్నంపల్లి-అచ్చంపల్లి మధ్య రోడ్డు పక్కన ఉన్న పొలాల్లో బోల్తా పడింది. డ్రైవర్‌కు అస్వస్థతగా ఉండటంతో బస్సు... అదుపుతప్పింది. పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. కంబదూరు నుంచి అనంతపురం వెళ్తున్న అనంతపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చిన్నంపల్లి-అచ్చంపల్లి మధ్య రోడ్డు పక్కన ఉన్న పొలాల్లో బోల్తా పడింది. డ్రైవర్‌కు అస్వస్థతగా ఉండటంతో బస్సు... అదుపుతప్పింది. పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.