ETV Bharat / state

'నియమాలు పాటించాలి.. కరోనా రాకుండా చూసుకోవాలి'

author img

By

Published : Mar 29, 2020, 6:28 PM IST

అనంతపురం జిల్లాలో కరోనా నియంత్రణ దిశగా అమలు చేస్తున్న చర్యలను అదనపు కలెక్టర్ రామ్మూర్తి, ఆర్డీవో పరిశీలించారు. క్వారెంటైన్ కేంద్రాలు, మార్కెట్లలో తనిఖీలు చేశారు.

Quarantine wards in annatapur
క్వారంటైన్ గదులను పరిశీలిస్తున్న జిల్లా యంత్రాంగం
గుంతకల్లులో పర్యటించిన జిల్లా అదనపు కలెక్టర్ రామ్మూర్తి

అనంతపురం జిల్లా గుంతకల్లులో అదనపు కలెక్టర్ రామ్మూర్తి ఆకస్మికంగా పర్యటించారు. జిల్లా వ్యాప్తంగా 43 క్వారెంటైన్​ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. వాటిలో ఏర్పాట్లు పరిశీలించేందుకు పర్యటన చేస్తున్నామన్నారు. గుంతకల్లు నియోజకవర్గ పరిధిలో 3 కేంద్రాలు పరిశీలించారు. అందరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటిస్తూ... కరోనా వైరస్​ను తరిమికొట్టాలన్నారు.

ఉరవకొండలో క్వారంటైన్ వార్డును పరిశీలించిన ఆర్డీవో

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలోని క్వారంటైన్ వార్డును ఆర్డీవో గుణభూషణ్ రెడ్డి పరిశీలించారు. కరోనా అనుమానితుల కోసం 100 పడకలతో గదులను సిద్ధం చేశారు. సామాజిక దూరం, స్వీయ నియంత్రణ పాటించడం ఒక్కటే కరోనా నివారణకు మార్గమని ఆయన అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ మైదానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కూరగాయల మార్కెట్ ను పరిశీలించి అక్కడి ధరలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో కిలో బెండకాయలు కొనుగోలు చేశారు.

ఇదీ చూడండి:

ఉత్తరాఖండ్​లో చిక్కుకున్న అనంతపురం వాసులు

గుంతకల్లులో పర్యటించిన జిల్లా అదనపు కలెక్టర్ రామ్మూర్తి

అనంతపురం జిల్లా గుంతకల్లులో అదనపు కలెక్టర్ రామ్మూర్తి ఆకస్మికంగా పర్యటించారు. జిల్లా వ్యాప్తంగా 43 క్వారెంటైన్​ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. వాటిలో ఏర్పాట్లు పరిశీలించేందుకు పర్యటన చేస్తున్నామన్నారు. గుంతకల్లు నియోజకవర్గ పరిధిలో 3 కేంద్రాలు పరిశీలించారు. అందరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ, సామాజిక దూరం పాటిస్తూ... కరోనా వైరస్​ను తరిమికొట్టాలన్నారు.

ఉరవకొండలో క్వారంటైన్ వార్డును పరిశీలించిన ఆర్డీవో

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలోని క్వారంటైన్ వార్డును ఆర్డీవో గుణభూషణ్ రెడ్డి పరిశీలించారు. కరోనా అనుమానితుల కోసం 100 పడకలతో గదులను సిద్ధం చేశారు. సామాజిక దూరం, స్వీయ నియంత్రణ పాటించడం ఒక్కటే కరోనా నివారణకు మార్గమని ఆయన అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ మైదానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కూరగాయల మార్కెట్ ను పరిశీలించి అక్కడి ధరలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో కిలో బెండకాయలు కొనుగోలు చేశారు.

ఇదీ చూడండి:

ఉత్తరాఖండ్​లో చిక్కుకున్న అనంతపురం వాసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.