ETV Bharat / state

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి - ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తాజా వార్తలు

పరిషత్‌ ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపిన మేరకు.. సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు బయల్దేరారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సిబ్బందికి కావాల్సిన సామాగ్రిని అధికారులు సమకూర్చారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లలో బిజీ...
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లలో బిజీ...
author img

By

Published : Apr 7, 2021, 6:10 PM IST

Updated : Apr 7, 2021, 10:51 PM IST

హైకోర్టు ధర్మాసనం పరిషత్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మేరకు.. అనంతపురం జిల్లా పెనుకొండలో ఎన్నికల హడావుడి మొదలైంది. పోలింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బందికి కావాల్సిన సామగ్రిని ఉన్నతాధికారులు సమకూర్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.

హైకోర్టు తీర్పు వచ్చేదాకా వేచి చూసిన అధికారులు.. మూడు గంటల్లోనే తీర్పు రావడంతో చకచకా ఎన్నికల సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. పెనుకొండ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సబ్ కలెక్టర్ నిశాంతి పరిశీలించారు.

ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చిన తమకు.. ఉన్నతాధికారులు కనీస సౌకర్యాలు కల్పించలేదని ఉద్యోగులు నిరసన చేపట్టారు. పరిషత్ ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు, ఎన్నికల సామాగ్రిని తీసుకెళ్లేందుకు.. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండల పరిషత్ కార్యాలయానికి వివిధ ప్రాంతాల ఉద్యోగులు చేరుకున్నారు. భోజనం సహా కనీస వసతులు కల్పించలేదని ఆగ్రహించిన ఉద్యోగులు.. ఆర్వోలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


హిందూపురంలో పరిషత్ ఎన్నికల ప్రక్రియకు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు, సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

గుంతకల్లు మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలకు, ఓ జడ్పీటీసీ స్థానానికి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సూర్యనారాయణ తెలిపారు. 13 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు 46 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ముందస్తు జాగ్రత్తగా పోలీస్ నిఘాతో పాటు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఇవ చదవండి:

జిల్లాలో... పరిషత్ ఎన్నికలకు అధికారుల ఏర్పాట్లు

హైకోర్టు ధర్మాసనం పరిషత్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మేరకు.. అనంతపురం జిల్లా పెనుకొండలో ఎన్నికల హడావుడి మొదలైంది. పోలింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బందికి కావాల్సిన సామగ్రిని ఉన్నతాధికారులు సమకూర్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.

హైకోర్టు తీర్పు వచ్చేదాకా వేచి చూసిన అధికారులు.. మూడు గంటల్లోనే తీర్పు రావడంతో చకచకా ఎన్నికల సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. పెనుకొండ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సబ్ కలెక్టర్ నిశాంతి పరిశీలించారు.

ఎన్నికల విధులు నిర్వహించేందుకు వచ్చిన తమకు.. ఉన్నతాధికారులు కనీస సౌకర్యాలు కల్పించలేదని ఉద్యోగులు నిరసన చేపట్టారు. పరిషత్ ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు, ఎన్నికల సామాగ్రిని తీసుకెళ్లేందుకు.. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండల పరిషత్ కార్యాలయానికి వివిధ ప్రాంతాల ఉద్యోగులు చేరుకున్నారు. భోజనం సహా కనీస వసతులు కల్పించలేదని ఆగ్రహించిన ఉద్యోగులు.. ఆర్వోలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


హిందూపురంలో పరిషత్ ఎన్నికల ప్రక్రియకు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు, సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

గుంతకల్లు మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలకు, ఓ జడ్పీటీసీ స్థానానికి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సూర్యనారాయణ తెలిపారు. 13 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు 46 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ముందస్తు జాగ్రత్తగా పోలీస్ నిఘాతో పాటు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఇవ చదవండి:

జిల్లాలో... పరిషత్ ఎన్నికలకు అధికారుల ఏర్పాట్లు

Last Updated : Apr 7, 2021, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.