ETV Bharat / state

ప్లాసిక్​తో ఇటుక అంట.... జాతీయ పోటీలకు ఎంపికైనట - plastic brick experiment in urvakonda news

ఓ ఉపాధ్యాయురాలు.. ఇద్దరు విద్యార్థులు... ప్లాస్టిక్​పై చేసిన ప్రయోగం జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. ప్రకృతికి మేలు చేసే ఉన్న ఈ ప్రయోగం.. మరో మైలురాయికి అడుగు దూరంలో నిలిచింది. ఆ వివరాలేంటే మీరూ తెలుసుకోండి.

plastic brick experiment in urvakonda
ప్లాసిక్​తో ఇటుక అంట.... జాతీయ పోటీలకు ఎంపికైనట
author img

By

Published : Jan 1, 2020, 10:30 AM IST

ప్లాసిక్​తో ఇటుక అంట.... జాతీయ పోటీలకు ఎంపికైనట

ప్లాస్టిక్​తో ప్రపంచం మమేకమైపోతోంది. ఇదే ప్లాస్టిక్.. పర్యావరణాన్ని విపరీతంగా కలుషితం చేస్తోంది. ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని ఇద్దరు విద్యార్థులతో ఓ ఉపాధ్యాయురాలు చేసిన ప్రయోగం.. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. అనంతపురం జిల్లా ఉరవకొండ జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు శైలజ, ఎనిమిదో తరగతి చదువతున్న విశ్వాస్, కమలనాథ్​... ప్లాస్టిక్ వ్యర్థాలు భూమ్మీద పేరుకు పోకుండా ఉండాలని భావించారు. అనుకున్నదే తడవుగా.. ఆలోచనను ప్రయోగం రూపంలో అమల్లో పెట్టారు.
ప్లాస్టిక్ కవర్లను సేకరించి, ఓ గోళంలో కరిగించారు. ఆ ప్లాస్టిక్​ను కంకర, ఇసుక సిమెంటతో కలిపి ఇటుకులు తయారు చేశారు. ఇవి మామూలు ఇటుకుల కంటే దృఢంగా ఉన్నాయి. ఇటీవల జరిగన జాతీయ సైన్స్ కాంగ్రెస్ లో వీటిని ప్రదర్శించగా.. ప్రశంసలు అందుకుంది. డిసెంబర్​లో కేరళలో జరిగే జాతీయ స్థాయి పోటీలకూ ఎంపికైంది.
ప్లాస్టిక్ రహిత వాతావరణాన్ని తీసుకురావటమే తమ లక్ష్యం అని ముక్త కంఠంతో చెప్తున్న ఈ ఉపాధ్యాయిని, విద్యార్థుల కృషి అభినందనీయం.

ఇదీ చదవండి: శ్రీచైతన్య విద్యాసంస్థల...ఫిట్ ఇండియా ప్రపంచ రికార్డులు కైవసం

ప్లాసిక్​తో ఇటుక అంట.... జాతీయ పోటీలకు ఎంపికైనట

ప్లాస్టిక్​తో ప్రపంచం మమేకమైపోతోంది. ఇదే ప్లాస్టిక్.. పర్యావరణాన్ని విపరీతంగా కలుషితం చేస్తోంది. ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని ఇద్దరు విద్యార్థులతో ఓ ఉపాధ్యాయురాలు చేసిన ప్రయోగం.. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. అనంతపురం జిల్లా ఉరవకొండ జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు శైలజ, ఎనిమిదో తరగతి చదువతున్న విశ్వాస్, కమలనాథ్​... ప్లాస్టిక్ వ్యర్థాలు భూమ్మీద పేరుకు పోకుండా ఉండాలని భావించారు. అనుకున్నదే తడవుగా.. ఆలోచనను ప్రయోగం రూపంలో అమల్లో పెట్టారు.
ప్లాస్టిక్ కవర్లను సేకరించి, ఓ గోళంలో కరిగించారు. ఆ ప్లాస్టిక్​ను కంకర, ఇసుక సిమెంటతో కలిపి ఇటుకులు తయారు చేశారు. ఇవి మామూలు ఇటుకుల కంటే దృఢంగా ఉన్నాయి. ఇటీవల జరిగన జాతీయ సైన్స్ కాంగ్రెస్ లో వీటిని ప్రదర్శించగా.. ప్రశంసలు అందుకుంది. డిసెంబర్​లో కేరళలో జరిగే జాతీయ స్థాయి పోటీలకూ ఎంపికైంది.
ప్లాస్టిక్ రహిత వాతావరణాన్ని తీసుకురావటమే తమ లక్ష్యం అని ముక్త కంఠంతో చెప్తున్న ఈ ఉపాధ్యాయిని, విద్యార్థుల కృషి అభినందనీయం.

ఇదీ చదవండి: శ్రీచైతన్య విద్యాసంస్థల...ఫిట్ ఇండియా ప్రపంచ రికార్డులు కైవసం

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.


() కొన్ని దశాబ్దాలుగా ప్లాస్టిక్ వినియోగం మన జీవితంలో నిత్యావసరం గా మారిపోయింది. దానిని వినియోగించి పడేసిన తరువాత అది భూమిలో కలవడం కష్టం. దీంతో ప్రకృతి పరంగా దాని నుంచి ఎదురయ్యే నష్టం ఎంతో అధికం.. అయితే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో అద్భుత ఆవిష్కరణలు చేశారు. కొత్త ఆలోచనలకు పదును పెట్టి విద్యార్ధులతో కలిసి అద్భుతం సృష్టించింది ఆ పాఠశాల ఉపాధ్యాయురాలు. వారితో కలిసి ఒక ప్రయోగాన్ని చేసి ఔరా అనిపించింది. ఈ ప్రయోగం జాతీయ స్థాయికి ఎంపిక అయ్యింది.

ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ నివారించాలన్నా ప్రచారమే కనిపిస్తుంది. దేశ ప్రధాని నుంచి అట్టడుగు స్థాయి వరకు అదే నినాదమే మారుమోగుతుంది. ఇలాంటి తరుణంలో ఇద్దరు చిన్నారులు తమ ఉపాధ్యాయినితో కలిసి ప్లాస్టిక్ నష్టాలను వివరిస్తూనే దానికి పరిష్కార మార్గాన్ని చూపే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. ఇప్పటికే భారీగా వాడి ఎక్కడపడితే అక్కడ దర్శనం ఇస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో ఒక సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఉపాధ్యాయుని పర్యవేక్షణలో ఆ చిన్నారులు చేసిన ప్రయత్నం జాతీయ స్థాయికి చేరింది. వారు భూమిలో కలవని ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసిన ఇటుకల ప్రయోగం అందరిని ఆలోచింపజేస్తుంది. ఆ ప్రయోగాన్ని చేసింది ఉరవకొండ జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు విశ్వాస్, కమల్నాథ్, ఉపాధ్యాయిని శైలజ.

జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విశ్వాస్, కమలనాథుల్లో సైన్స్ లో సృజనాత్మకత గుర్తించిన ఉపాధ్యాయిని శైలజ వారిని ఆ ప్రయోగం దిశగా ప్రోత్సహించారు. ఆమె పర్యవేక్షణలో ప్లాస్టిక్ కవర్లను ఒక గోలెంలో కరిగించి మిశ్రమంగా మార్చుకుని ఇటుకలు తయారు చేశారు. ఈ ప్రయోగం అందరి దృష్టిని ఆకర్షించింది. కవర్లు భూమిమీద పేరుకుపోకుండా ఉండడానికి ఇది కూడా సరైన మార్గం అన్న భావన జాతీయ సైన్స్ కాంగ్రెస్ లో ఆలోచింపజేసింది. దీంతో ఈ ప్రయోగం జాతీయ పోటీలకు ఎంపిక అయ్యింది. ఈ పోటీలు డిసెంబర్ లో కేరళలో జరగనున్నట్లు ఆ పాఠశాల హెచ్ఎం నారాయణ తెలిపారు.

*భూమిలో కలవని ప్లాస్టిక్ తో నష్టాలను గుర్తించి*

కొన్ని దశాబ్దాలుగా ప్లాస్టిక్ వినియోగం మన జీవితంలో నిత్యావసరం గా మారిపోయింది. దానిని వినియోగించి పడేసిన తరువాత అది భూమిలో కలవడం కష్టం. దీంతో ప్రకృతి పరంగా దాని నుంచి ఎదురయ్యే నష్టాలను ఉపాధ్యాయిని ఆధ్వర్యంలోని విద్యార్థుల బృందం సమాజం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేసింది. వారు నిరుపయోగమైన కవర్ల వల్ల కలిగే నష్టాలను గుర్తించారు, భూమి మీద వృధాగా పడి ఉన్న కవర్లను సేకరించి పౌడర్ గా మారుస్తారు, వాటిని కరిగించి ఆ మిశ్రమాన్ని కంకర, ఇసుక, సిమెంట్ తో కలిపి ఇటుకలు తయారు చేస్తారు. ఇది సాధారణ ఇటుకల కన్నా బలంగా ఉంటాయి.


Body:బైట్ 1 : శైలజ, ఉపాధ్యాయురాలు.
బైట్ 2 : విశ్వాస్, విద్యార్థి.
బైట్ 3 : కమలనాథ్, విద్యార్థి.
బైట్ 4 : నారాయణ, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు.


Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 04-12-2019
sluge : ap_atp_71_04_students_teacher_experiment_success_PKG_AP10097
cell : 9704532806

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.