ETV Bharat / state

రెండు నిమిషాలు మనస్సాక్షిని అడిగి ఓటేయండి - sunitha

'నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించాం. ప్రభుత్వ పథకాలు అందరికి అందేలా చేశాం. ఎన్నికలప్పుడు లబ్ధిదారులు ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి ఎవరికి ఓటు వేయాలో.... అది నిస్వార్థ గుండె అయితే వేలు తెదేపా వైపు చూపిస్తుంది' -ప్రచారంలో పరిటాల శ్రీరామ్

ప్రచారంలో పరిటాల శ్రీరామ్
author img

By

Published : Mar 30, 2019, 6:47 AM IST

పరిటాల ప్రచారం
పోలింగ్ సమయం దగ్గరపడుతున్నందున రాప్తాడు తెదేపా అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. తన తల్లి పరిటాల సునీతతో కలిసి నియోజకవర్గ పరిధిలోని ఎర్రగుంట్ల, బండమీదపల్లిలో శుక్రవారం రాత్రి ప్రచారం నిర్వహించారు. వెళ్లిన ప్రతిచోట పూలవర్షం కురిపిస్తూ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బండమీదపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించిన పరిటాల శ్రీరామ్... ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా పేదలకు ఏ లోటు రానీయకుండా సీఎం చంద్రబాబు పంచిన సంక్షేమ పథకాలు నిరుపేదల ముఖాల్లో కళ తెచ్చాయన్నారు. చెరువులను కృష్ణా నీటితో నింపడం వల్లనే గొర్రెల మందల పెంపకం వృత్తి వదిలేసిన వారంతా మళ్లీ మందపెట్టుకొని జీవనోపాధి వృద్ధి చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. 2నిమిషాలు ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు.ప్రతిపక్ష పార్టీలు నవరత్నాల పేరుతో చేస్తున్న ప్రచారం వట్టి బూటకమని మంత్రి పరిటాల సునీత విమర్శించారు. తాము ఐదేళ్ల కాలంలో రోడ్ల నిర్మాణం మొదలు తాగునీరు, పింఛన్లతో పాటు, మహిళలకు ఆర్థికంగా ఆదుకునే చంద్రన్న పసుపు కుంకుమ పథకాలు అమలు చేశారమని చెప్పారు.

పరిటాల ప్రచారం
పోలింగ్ సమయం దగ్గరపడుతున్నందున రాప్తాడు తెదేపా అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. తన తల్లి పరిటాల సునీతతో కలిసి నియోజకవర్గ పరిధిలోని ఎర్రగుంట్ల, బండమీదపల్లిలో శుక్రవారం రాత్రి ప్రచారం నిర్వహించారు. వెళ్లిన ప్రతిచోట పూలవర్షం కురిపిస్తూ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బండమీదపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించిన పరిటాల శ్రీరామ్... ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా పేదలకు ఏ లోటు రానీయకుండా సీఎం చంద్రబాబు పంచిన సంక్షేమ పథకాలు నిరుపేదల ముఖాల్లో కళ తెచ్చాయన్నారు. చెరువులను కృష్ణా నీటితో నింపడం వల్లనే గొర్రెల మందల పెంపకం వృత్తి వదిలేసిన వారంతా మళ్లీ మందపెట్టుకొని జీవనోపాధి వృద్ధి చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. 2నిమిషాలు ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు.ప్రతిపక్ష పార్టీలు నవరత్నాల పేరుతో చేస్తున్న ప్రచారం వట్టి బూటకమని మంత్రి పరిటాల సునీత విమర్శించారు. తాము ఐదేళ్ల కాలంలో రోడ్ల నిర్మాణం మొదలు తాగునీరు, పింఛన్లతో పాటు, మహిళలకు ఆర్థికంగా ఆదుకునే చంద్రన్న పసుపు కుంకుమ పథకాలు అమలు చేశారమని చెప్పారు.
sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.