అనంతపురం జిల్లా ఉరవకొండ మేజర్ గ్రామ పంచాయతీలో సుంకాల వసూలు నిమిత్తం నిర్వహించిన టెండర్లలో.. పంచాయతీకి భారీ ఆదాయం లభించింది. ప్రత్యేక అధికారి దామోదరరెడ్డి, ఈవో శ్యామల ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ కార్యాలయంలో దినసరి మార్కెట్, బస్టాండ్, మేకలు - గొర్రెలు, పాయిఖానా నిర్వహణకు సుంకం వసూళ్ల హక్కు నిమిత్తం టెండర్లు నిర్వహించారు.
వీటిలో పెద్దమొత్తంలో టెండర్లు దాఖలయ్యాయి. గత ఏడాది రూ.17,63,600/- ఆదాయం సమకూరగా.. ఈ ఏడాది రూ. 32,06,342/- గ్రామ పంచాయతీ ఖజానాకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఆదాయం దాదాపు రెట్టింపు అయ్యిందని అధికారులు తెలిపారు.