అనంతపురం నగర శివారులో ఓ ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు... అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా...6 గురికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతకు ముందు మరూరు టోల్గేట్ సిబ్బందితో...బస్సు డ్రైవర్ వాగ్వాదానికి దిగాడని ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్ వేగంగా బస్సు నడపడమే వల్లే తపోవనం సర్కిల్ వద్ద బస్సు ప్రమాదానికి గురైందన్నారు.
ఇదీ చూడండి: రోడ్డు ప్రమాదంలో అటవీ శాఖ అధికారి మృతి