ETV Bharat / state

డివైడర్​ను ఢీకొన్న బైక్​.... ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు..

author img

By

Published : Jan 15, 2021, 2:10 AM IST

ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం అనంతపురం జిల్లా సోమందేపల్లిలో జరిగింది. మృతుడు ఇందిరానగర్​కు చెందిన వాలంటీర్ దేవరాజ్​గా గుర్తించారు.

అదుపుతప్పి డివైడర్​ను ఢీకొన్న బైక్​.... ఒకరి మృతి, మరో ఇద్దరికి గాయాలు..
అదుపుతప్పి డివైడర్​ను ఢీకొన్న బైక్​.... ఒకరి మృతి, మరో ఇద్దరికి గాయాలు..



అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం లోని నలగొండరాయునపల్లి సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొని యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సోమందేపల్లి మండల కేంద్రంలోని ఇందిరా నగర్​కు చెందిన వాలంటీరు దేవరాజు... మరో ఇద్దరితో కలిసి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో దేవరాజ్ మృతిచెందాడు. సోమందేపల్లికి చెందిన జగదీష్, చాకర్లపల్లికి చెందిన శ్రీకాంత్​కు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను పెనుగొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ఈ ఘటనపై సోమందేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం లోని నలగొండరాయునపల్లి సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొని యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సోమందేపల్లి మండల కేంద్రంలోని ఇందిరా నగర్​కు చెందిన వాలంటీరు దేవరాజు... మరో ఇద్దరితో కలిసి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో దేవరాజ్ మృతిచెందాడు. సోమందేపల్లికి చెందిన జగదీష్, చాకర్లపల్లికి చెందిన శ్రీకాంత్​కు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను పెనుగొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ఈ ఘటనపై సోమందేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి

అప్పుల బాధ భరించలేక.. అన్నదాత ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.