జేసీ దివాకర్రెడ్డి మద్యం మత్తులో మాట్లాడతారని రహదారులు, భవనాల శాఖ మంత్రి ఎం.శంకర నారాయణ ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోయిన తెదేపా అసహనాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఎంత మోసకారో రాష్ట్ర ప్రజలకు తెలుసునని మంత్రి వ్యాఖ్యానించారు. దివాకర్రెడ్డి సీఎం గురించి మాట్లాడడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులు, మైనింగ్ విషయంలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి విమర్శించారు.
ఇదీ చదవండి: ముగిసిన మంత్రివర్గ సమావేశం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చర్చ