ETV Bharat / state

కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలి - కదిరిలో కరోనా కేసులు

కరోనా వైరస్ రెండో దశ విజృంభిస్తున్నందున కర్ఫ్యూను మరింత పకడ్బందీగా అమలు చేస్తామని అనంతపురం జిల్లా కదిరి డీఎస్పీ భవ్య కిషోర్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు అత్యవసర సేవలు మినహా మిగతా వాటికి అనుమతి లేదని ఆమె తెలిపారు.

kadiri
కదిరి కర్ఫ్యూపై కదిరి డీఎస్పీ సమావేశం
author img

By

Published : May 19, 2021, 7:54 PM IST

కరోనా వైరస్ రెండో దశ విస్తృతంగా వ్యాపిస్తున్నందున అనంతపురం జిల్లా కదిరిలో కర్ఫ్యూను మరింత కఠినంగా అమలు చేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలు కోసం ప్రజలు బయటికి రావాలని డీఎస్పీ భవ్య కిషోర్ సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు అత్యవసర సేవలు మినహా… మిగతావాటికి అనుమతి లేదని ఆమె అన్నారు. కర్ఫ్యూ వేళల్లో మార్పు లేదని ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి కరోనా కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మాస్కు ధరించని 13 వేల మందికి జరిమానా వేశామని వెల్లడించారు. సరైన కారణం లేకుండా బయటికి వచ్చిన 175 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు ,రెండు కార్లను జప్తు చేశామని తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

ఇదీ చూడండి.

కరోనా వైరస్ రెండో దశ విస్తృతంగా వ్యాపిస్తున్నందున అనంతపురం జిల్లా కదిరిలో కర్ఫ్యూను మరింత కఠినంగా అమలు చేయనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలు కోసం ప్రజలు బయటికి రావాలని డీఎస్పీ భవ్య కిషోర్ సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు అత్యవసర సేవలు మినహా… మిగతావాటికి అనుమతి లేదని ఆమె అన్నారు. కర్ఫ్యూ వేళల్లో మార్పు లేదని ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి కరోనా కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మాస్కు ధరించని 13 వేల మందికి జరిమానా వేశామని వెల్లడించారు. సరైన కారణం లేకుండా బయటికి వచ్చిన 175 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు ,రెండు కార్లను జప్తు చేశామని తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

ఇదీ చూడండి.

బ్లాక్‌ ఫంగస్‌ కలవరం.. ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్ధారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.