ETV Bharat / state

'పనికిరాని కాయలు ఇస్తే.. పంటలు ఎలా చేతికి వచ్చేది?'

కాయలే లేని వాటిని విత్తనాలుగా ఇస్తే.. తమ పంట ఎలా నిలిచేది.. బతికేదని అనంతపురం జిల్లా గాండ్లపెంట రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

author img

By

Published : May 31, 2020, 7:10 AM IST

ananthapuram district
'పనికిరాని కాయలు ఇస్తే.. పంటలు ఎలా చేతికి వచ్చేది'

అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం నంబులపూలకుంట రైతులు.. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రాయితీ విత్తన వేరుశనగ సరఫరా కేంద్రాల వద్ద ఆందోళనకు దిగారు. నాసిరకం కాయలను ఇస్తున్నారంటూ రైతులు వ్యవసాయశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. వారికి వామపక్ష నాయకులు మద్దతు తెలిపారు.

ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తోందని ఇలాంటి సమయంలో నాణ్యతలేని కాయలను పంపిణీ చేసి రైతులను నష్టాల పాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన కాయలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయశాఖ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు రైతులకు నచ్చచెప్పి పంపించారు.

అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం నంబులపూలకుంట రైతులు.. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రాయితీ విత్తన వేరుశనగ సరఫరా కేంద్రాల వద్ద ఆందోళనకు దిగారు. నాసిరకం కాయలను ఇస్తున్నారంటూ రైతులు వ్యవసాయశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. వారికి వామపక్ష నాయకులు మద్దతు తెలిపారు.

ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తోందని ఇలాంటి సమయంలో నాణ్యతలేని కాయలను పంపిణీ చేసి రైతులను నష్టాల పాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన కాయలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయశాఖ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు రైతులకు నచ్చచెప్పి పంపించారు.

ఇదీ చదవండి:

త్రిశూల వ్యూహంతో లాక్​డౌన్​ 5.0- కొత్త రూల్స్​ ఇవే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.