Government Whip Ramachandra Reddy: అనంతపురం జిల్లా రాయదుర్గం వైకాపా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.. భద్రతా సిబ్బందిని తిరస్కరించారు. ప్రభుత్వ విప్గా ఉన్న రామచంద్రారెడ్డికి.. ఒక హెడ్ కానిస్టేబుల్, ముగ్గురు కానిస్టేబుల్ కలిపి నలుగురు గన్మెన్లు ఉన్నారు. ఐతే.. ఎమ్మెల్యే తన గన్మెన్లను వద్దని......... పంపించారు.
రాయదుర్గంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలోనూ.. గన్మెన్లు లేకుండానే పాల్గొన్నారు.
విదేశాల్లో ఉన్నత చదువులకు వెళుతున్నట్లు ప్రచారం వినిపిస్తున్నది. కళ్యాణదుర్గం డిఎస్పి శ్రీనివాసులు కాపును కలిసి చర్చలు జరిపారు. తాను ఉన్నత విద్యను అభ్యసిస్తున్నందున గన్ మెన్లు ఉండటం ఇబ్బందిగా ఉంటుందని, సంక్రాంతి అనంతరం మళ్లీ గన్మెన్లను నియమించమని కాపు రామచంద్రారెడ్డి పోలీసు అధికారులకు సూచించినట్లు తెలిసింది. కాపు వ్యూహం ప్రజా ప్రతినిధులకు, అధికారులకు అంతుచిక్కడం లేదు. గన్ మెన్ లను ఎందుకు ఉపసంహరించారో ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
గన్మెన్లను తిరస్కరిస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఈటీవీ ప్రతినిధి రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డిని సంప్రదించగా, అలాంటిదేమీ లేదని కొట్టివేశారు. తన ఇంటి వద్ద వచ్చి చూడమని పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: