ETV Bharat / state

చిన్నాన్న కుమారుడిని చంపిన పెదనాన్న కుమారులు - గొర్రెపల్లి క్రైం న్యూస్

ఆస్తుల కోసం రాజుకున్న వివాదం... ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. వరుసకి సోదరులైన వారే దాడికి తెగబడి చంపేశారు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా గొర్రెపల్లిలో జరిగింది.

murder
ఆస్తి కోసం హత్య
author img

By

Published : Jan 18, 2021, 7:20 AM IST

అనంతపురం జిల్లా పరిగి మండలం గొర్రెపల్లిలో దారుణం జరిగింది. అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం.. ఒకరి హత్యకు కారణమైంది. అన్నదమ్ములైన జూతప్ప, దాలప్ప మధ్య ఆస్తి గురించి 15 రోజులుగా వివాదం జరుగుతోంది.

ఈ క్రమంలో జూతప్ప కుమారులైన నరేంద్ర, ఓబిలేశు, నరసింహా... దాలప్ప కుమారులపై కత్తులు, కట్టెలతో దాడి చేశారు. ఈ దాడిలో చినరాజప్ప మృతి చెందగా.. అతని సోదరుడు చికిత్స పొందుతున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పరిగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అనంతపురం జిల్లా పరిగి మండలం గొర్రెపల్లిలో దారుణం జరిగింది. అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదం.. ఒకరి హత్యకు కారణమైంది. అన్నదమ్ములైన జూతప్ప, దాలప్ప మధ్య ఆస్తి గురించి 15 రోజులుగా వివాదం జరుగుతోంది.

ఈ క్రమంలో జూతప్ప కుమారులైన నరేంద్ర, ఓబిలేశు, నరసింహా... దాలప్ప కుమారులపై కత్తులు, కట్టెలతో దాడి చేశారు. ఈ దాడిలో చినరాజప్ప మృతి చెందగా.. అతని సోదరుడు చికిత్స పొందుతున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పరిగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

సెల్​ఫోన్ అమ్మేశారు... డబ్బుతో అదృశ్యమయ్యారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.