అనంతపురం జిల్లా హిందూపురంలో భాజపా నాయకుల ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఈ విషయంపై.. భాజపా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురం - బెంగళూరు బైపాస్ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు.
ఫ్లెక్సీలను చించివేసిన దుండగులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్కు వ్యతిరేకంగా నినదించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిరసనకారులకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. ఎంతకూ వినని కారణంగా వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి: