అనంతపురం జిల్లా గుంతకల్ డీఎస్పీ కసీం సాహెబ్ ఆదేశాల మేరకు డోనేకల్ చెక్పోస్ట్ వద్ద విడపనకల్ మండలానికి చెందిన భాస్కర్ అనే ద్విచక్రవాహనాల దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఈ ప్రాంతంలో ద్విచక్రవాహనం దొంగలించిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దొంగ కోసం గాలిస్తుండగా భాస్కర్ పట్టుబడ్డాడు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన 24 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లాలో 7, కర్నూల్ జిల్లాలో 10, కడపలో 1, కర్ణాటక 7 ద్విచక్రవాహనాలు దొంగలించినట్లు పోలీసులు తెలిపారు. కేసును ఛేదించడంలో చొరవ చూపిన విడపనకల్ పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
ఇది చదవండి 10 గ్రేడ్లపై ముమ్మర కసరత్తు ... విద్యార్థుల్లో టెన్షన్ టెన్షన్