ETV Bharat / state

ప్రభుత్వ మద్యం పేరిట నకిలీ మందు విక్రయం.. నలుగురు అరెస్ట్​ - fake liquor selling persons arrested in anantapur district

ప్రభుత్వ మద్యం పేరిట నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్న ముఠాను అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నలుగురిని అరెస్ట్​ చేయగా.. మరో ఐదుగురికోసం గాలిస్తున్నారు.

fake liquor
నకిలీ మందు
author img

By

Published : Jul 5, 2021, 6:33 PM IST

ఎస్పీ సత్యయేసుబాబు

ప్రభుత్వం విక్రయించే మద్యం తరహాలోనే లేబుల్ వేసి నకిలీ మద్యాన్ని అమ్ముతున్న ముఠాను అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరం మండలంలోని గ్రామాల్లో విస్కీ, క్వార్టర్ సీసాల అమ్మకాలపై దృష్టిపెట్టిన పోలీసులు నకిలీ మద్యం ముఠాను పట్టుకున్నారు. అనంతపురానికి చెందిన బద్వేల్ జిలానీ బాషా 2011లో ఇంజినీరింగ్ పూర్తి చేసి పలుచోట్ల పనిచేశాడు. సులభ మార్గాల్లో అధిక సొమ్ము సంపాదించాలని నకిలీ మద్యం విక్రయాలు చేస్తున్నాడు.

బళ్లారికి చెందిన స్పిరిట్ సరఫరాదారుడితో పరిచయం ఏర్పడి... అక్కడి నుంచి స్పిరిట్ కొనుగోలు చేసి, బెంగళూరు నుంచి ఖాళీ సీసాలు, మూతలు కొన్నాడు. సీసాలకు సీలు వేసే యంత్రాన్ని గుజరాత్ నుంచి పదకొండు వేల రూపాయలకు కొనుగోలు చేసిన జిలానీ బాషా.. మరో ముగ్గురితో కలిసి అనంతపురం నగర శివారులోని కక్కలపల్లిలో నకిలీ మద్యం తయారు చేస్తున్నాడు. ఈ నకిలీ మద్యాన్ని హర్షవర్దన్ రెడ్డి, సుబ్బమ్మల ద్వారా గ్రామాల్లో బెల్టు షాపులకు విక్రయించే ఏర్పాట్లు చేసుకున్నారు. ధర్మవరం, కళ్యాణదుర్గంలో ఇలా కొంతమందిని ఏర్పాటు చేసుకొని, స్టాకును వారికి పంపి.. అక్కడి నుంచి సరఫరా చేయించేవాడు.

ఈ ముఠాలో తొమ్మిది మంది కీలకమైన నిందితులు కాగా, ప్రస్తుతం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురికోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరితోపాటు నకలీ మద్యం తయారీకి లేబుళ్లు డిజైన్ చేసిన, ముద్రించిన వ్యక్తులు, స్పిరిట్ సరఫరా చేసిన సీసాలు, మూతలు.. సరఫరా చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకోటానికి పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:

అబ్బురపరుస్తున్న 17.5 అంగుళాల పుంగ‌నూరు ఆవు దూడ

ఎస్పీ సత్యయేసుబాబు

ప్రభుత్వం విక్రయించే మద్యం తరహాలోనే లేబుల్ వేసి నకిలీ మద్యాన్ని అమ్ముతున్న ముఠాను అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరం మండలంలోని గ్రామాల్లో విస్కీ, క్వార్టర్ సీసాల అమ్మకాలపై దృష్టిపెట్టిన పోలీసులు నకిలీ మద్యం ముఠాను పట్టుకున్నారు. అనంతపురానికి చెందిన బద్వేల్ జిలానీ బాషా 2011లో ఇంజినీరింగ్ పూర్తి చేసి పలుచోట్ల పనిచేశాడు. సులభ మార్గాల్లో అధిక సొమ్ము సంపాదించాలని నకిలీ మద్యం విక్రయాలు చేస్తున్నాడు.

బళ్లారికి చెందిన స్పిరిట్ సరఫరాదారుడితో పరిచయం ఏర్పడి... అక్కడి నుంచి స్పిరిట్ కొనుగోలు చేసి, బెంగళూరు నుంచి ఖాళీ సీసాలు, మూతలు కొన్నాడు. సీసాలకు సీలు వేసే యంత్రాన్ని గుజరాత్ నుంచి పదకొండు వేల రూపాయలకు కొనుగోలు చేసిన జిలానీ బాషా.. మరో ముగ్గురితో కలిసి అనంతపురం నగర శివారులోని కక్కలపల్లిలో నకిలీ మద్యం తయారు చేస్తున్నాడు. ఈ నకిలీ మద్యాన్ని హర్షవర్దన్ రెడ్డి, సుబ్బమ్మల ద్వారా గ్రామాల్లో బెల్టు షాపులకు విక్రయించే ఏర్పాట్లు చేసుకున్నారు. ధర్మవరం, కళ్యాణదుర్గంలో ఇలా కొంతమందిని ఏర్పాటు చేసుకొని, స్టాకును వారికి పంపి.. అక్కడి నుంచి సరఫరా చేయించేవాడు.

ఈ ముఠాలో తొమ్మిది మంది కీలకమైన నిందితులు కాగా, ప్రస్తుతం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురికోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరితోపాటు నకలీ మద్యం తయారీకి లేబుళ్లు డిజైన్ చేసిన, ముద్రించిన వ్యక్తులు, స్పిరిట్ సరఫరా చేసిన సీసాలు, మూతలు.. సరఫరా చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకోటానికి పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:

అబ్బురపరుస్తున్న 17.5 అంగుళాల పుంగ‌నూరు ఆవు దూడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.