ETV Bharat / state

కరోనాతో మహిళ మృతి.. 'ఆపద్భాందవ' ఆధ్వర్యంలో అంతిమ సంస్కారాలు - apadbhandava Trust conducted the funeral for the old woman who died with Corona

కరోనాతో మృతి చెందిన వృద్ధురాలికి అన్ని తామై అంత్యక్రియలు నిర్వహించారు ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు. అయినవారు ఉన్నప్పటికీ ఆమె అంతిమసంస్కారాలు నిర్వహించటానికి వారు నిరాకరించారు.

covid death cases
కరోనా మృతురాలికి అంత్యక్రియలు
author img

By

Published : May 15, 2021, 4:11 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని చిన్న ముష్టురుమానికి చెందిన సుంకమ్మ (75 ) కొవిడ్​తో మరణించింది. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరు ముందుకు రాలేదు. ఈ క్రమంలో గ్రామస్థులు కొందరు ఉరవకొండ ఆపద్భాందవ ట్రస్ట్​కు విషయం తెలిపారు. వారు గ్రామానికి చేరుకొని.. పీపీఈ కిట్లు ధరించి కరోనా నిబంధనలు పాటిస్తూ ఊరి బయట అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంస్థ కరోనా సమయంలో ఎంతో మంది అనాథలకు ఆహారం అందించడం.. ఎవరైన చనిపోతే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. వీరి మానవత్వం చూసి పలువురు అభినందించారు. అయిన వల్లే అంత్యక్రియలు చేయలేని స్థితిలో ఆపద్బాంధవుల్లా వచ్చి సహాయం చేసిన వారి బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని చిన్న ముష్టురుమానికి చెందిన సుంకమ్మ (75 ) కొవిడ్​తో మరణించింది. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరు ముందుకు రాలేదు. ఈ క్రమంలో గ్రామస్థులు కొందరు ఉరవకొండ ఆపద్భాందవ ట్రస్ట్​కు విషయం తెలిపారు. వారు గ్రామానికి చేరుకొని.. పీపీఈ కిట్లు ధరించి కరోనా నిబంధనలు పాటిస్తూ ఊరి బయట అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంస్థ కరోనా సమయంలో ఎంతో మంది అనాథలకు ఆహారం అందించడం.. ఎవరైన చనిపోతే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. వీరి మానవత్వం చూసి పలువురు అభినందించారు. అయిన వల్లే అంత్యక్రియలు చేయలేని స్థితిలో ఆపద్బాంధవుల్లా వచ్చి సహాయం చేసిన వారి బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండీ.. ఆగని రెమ్‌డెసివిర్‌ దందా.. వైద్య సిబ్బంది ప్రమేయంతో నల్లబజారుకు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.