అనంతపురం జిల్లా కదిరి మండలం మరవతాండాలో మహిళపై దాడి జరిగింది. మురుగు నీటి గుంతను తవ్వుకునే విషయంలో స్థానిక రమేష్, అంజి నాయక్ అనే వ్యక్తులు... బాబూ నాయక్, ఆయన భార్య మైనాపై కొడవలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని కదిరి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: