ETV Bharat / state

గాయని సునీత పేరుతో మోసం... వ్యక్తిపై కేసు నమోదు

author img

By

Published : Aug 7, 2020, 5:24 PM IST

ప్రముఖ గాయని సునీత పీఏనంటూ వ్యక్తిని మోసం చేసిన యువకుడిపై అనంతపురంలో కేసు నమోదైంది. తన నుంచి నిందితుడు 5 లక్షల రూపాయలు వసూలు చేశాడని బాధితుడు వెల్లడించాడు.

singer sunitha fake pa
singer sunitha fake pa

ప్రముఖ గాయని సునీత పీఏనంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై అనంతపురంలో కేసు నమోదైంది. నిందితుడి చేతిలో మోసపోయిన ఓ వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

అనంతపురం జిల్లాలోని రామగిరి మండలానికి చెందిన చైతన్య అనే వ్యక్తి... తాను సింగర్ సునీత పీఏనని చెప్పి.. అనంతపురం నగర శివారులోని రుద్రంపేటకు చెందిన రమేశ్​ను నమ్మబలికాడు. సునీతతో ఈవెంట్ ఇప్పిస్తానని చెప్పి తన నుంచి చైతన్య ఐదు లక్షలు ఇప్పించుకున్నట్లు బాధితుడు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఇలాంటి తప్పుడు మాటలు నమ్మి ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని ప్రజలకు సీఐ సూచించారు. అనుమానం వస్తే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.

ప్రముఖ గాయని సునీత పీఏనంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై అనంతపురంలో కేసు నమోదైంది. నిందితుడి చేతిలో మోసపోయిన ఓ వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

అనంతపురం జిల్లాలోని రామగిరి మండలానికి చెందిన చైతన్య అనే వ్యక్తి... తాను సింగర్ సునీత పీఏనని చెప్పి.. అనంతపురం నగర శివారులోని రుద్రంపేటకు చెందిన రమేశ్​ను నమ్మబలికాడు. సునీతతో ఈవెంట్ ఇప్పిస్తానని చెప్పి తన నుంచి చైతన్య ఐదు లక్షలు ఇప్పించుకున్నట్లు బాధితుడు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఇలాంటి తప్పుడు మాటలు నమ్మి ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని ప్రజలకు సీఐ సూచించారు. అనుమానం వస్తే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.

ఇదీ చదవండి

వాడు నాకు కనిపిస్తే దేహశుద్ధి తప్పదు: గాయని సునీత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.