ETV Bharat / state

41 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివార్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న 41 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనంతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నారు.

author img

By

Published : Jul 29, 2019, 6:08 PM IST

రేషన్ బియ్యం పట్టివేత
రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న 41 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అనంతపురం జిల్లా గుత్తి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత రాత్రి పట్టణ శివార్లలో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. గుంతకల్లు నుంచి గుత్తికి వస్తున్న బొలెరో వాహనంలో ఎలాంటి రశీదు లేకుండా తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ అధికారులకు సమాచారం అందిచగా.. అక్రమ రేషన్ బియ్యంగా నిర్థరించారు. అనంతరం వాహనాన్ని సీజ్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వాటిని మిల్లులకు తరలించి సన్నబియ్యంగా మార్చి పక్కరాష్ట్రాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని అక్రమ రవాణాపై విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి... శక్తి టీం టిక్ టాక్ వీడియోపై.. విశాఖ సీపీ ఆగ్రహం

రేషన్ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న 41 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అనంతపురం జిల్లా గుత్తి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత రాత్రి పట్టణ శివార్లలో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. గుంతకల్లు నుంచి గుత్తికి వస్తున్న బొలెరో వాహనంలో ఎలాంటి రశీదు లేకుండా తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ అధికారులకు సమాచారం అందిచగా.. అక్రమ రేషన్ బియ్యంగా నిర్థరించారు. అనంతరం వాహనాన్ని సీజ్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వాటిని మిల్లులకు తరలించి సన్నబియ్యంగా మార్చి పక్కరాష్ట్రాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని అక్రమ రవాణాపై విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి... శక్తి టీం టిక్ టాక్ వీడియోపై.. విశాఖ సీపీ ఆగ్రహం

Intro:jk_ap_atp_51_29_prakrurhi_vyavasayam_av_ap10094


Body:అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి ప్రకృతి వ్యవసాయం కు సంబంధించిన విజువల్స్.


Conclusion:R.Ganesh
RPD(ATP)
9440130913
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.