ETV Bharat / state

ఆర్టీసీ బస్సు ఢీకొని.. 40 గొర్రెలు మృతి

author img

By

Published : Nov 30, 2020, 9:38 AM IST

Updated : Nov 30, 2020, 10:40 AM IST

కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు అనంతపురం జిల్లా శివరాంపేట గ్రామ శివారులో గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 40 గొర్రెలు మృతి చెందగా.. మరో 30 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ ప్రమాదంలో లక్షల్లో నష్టపోయిన తనను ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు.

40 sheeps dead in RTC bus hit
ఆర్టీసీ బస్సును ఢీకొని 40 గొర్రెలు మృతి


కూడేరు మండలం శివరాంపేట గ్రామ శివారులో గొర్రెల మందపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. అనంతపురం నుంచి బళ్ళారికి వెళ్తున్న బస్సు ముష్టురుకు చెందిన మల్లికార్జున అనే రైతుకు చెందిన గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రైతుకు సంబంధించిన 40 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 30 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో తనకు తీవ్ర నష్టం వాటిల్లిందని, నష్టం అంచనా వేసి తనకు న్యాయం చేయాలని రైతు వాపోతున్నాడు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.


కూడేరు మండలం శివరాంపేట గ్రామ శివారులో గొర్రెల మందపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. అనంతపురం నుంచి బళ్ళారికి వెళ్తున్న బస్సు ముష్టురుకు చెందిన మల్లికార్జున అనే రైతుకు చెందిన గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రైతుకు సంబంధించిన 40 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 30 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో తనకు తీవ్ర నష్టం వాటిల్లిందని, నష్టం అంచనా వేసి తనకు న్యాయం చేయాలని రైతు వాపోతున్నాడు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.

ఇవీ చూడండి...

షాహిదా బేగం హత్యకేసులో మరో ముగ్గురు అరెస్టు

Last Updated : Nov 30, 2020, 10:40 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.