కూడేరు మండలం శివరాంపేట గ్రామ శివారులో గొర్రెల మందపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. అనంతపురం నుంచి బళ్ళారికి వెళ్తున్న బస్సు ముష్టురుకు చెందిన మల్లికార్జున అనే రైతుకు చెందిన గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రైతుకు సంబంధించిన 40 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 30 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో తనకు తీవ్ర నష్టం వాటిల్లిందని, నష్టం అంచనా వేసి తనకు న్యాయం చేయాలని రైతు వాపోతున్నాడు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.
ఇవీ చూడండి...