ETV Bharat / state

అల్లూరి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత.. విలువ తెలిస్తే షాక్​..! - అల్లూరి జిల్లా డొంక‌రాయి

Transporting Ganja: పోలీసుల కళ్లుగప్పి గంజాయి తరలించాలనుకున్నారు. ఇందుకోసం ఇంటింటికి తిరుగుతూ వస్తువులు అమ్మే సేల్స్​మన్​ అవతారమెత్తారు. ఇలా చేస్తున్నవారిపై పోలీసుల‌కు అనుమానం వ‌చ్చింది. వారి వద్దనున్న బ్యాగుల‌ను త‌నిఖీ చేయగా.. ప్యాకింగ్ చేసిన గంజాయి బయటడింది. ఈ ఘటన అల్లూరి జిల్లా డొంక‌రాయిలో జరిగింది.

ganja illegally transporting
అక్రమంగా గంజాయి రవాణా
author img

By

Published : Oct 4, 2022, 10:48 PM IST

Transporting Ganja in Alluri district: ఎప్పటిమాదిరిగానే పోలీసులు వాహ‌నాలు త‌నిఖీ చేశారు. ఆ ప్రాంతంలో సుమారు 11 మంది యువకులు వీధుల్లో సామాగ్రిని అమ్మడానికి వెళ్తున్నట్లు పోలీసుల‌కు తెలిపారు. అనుమానం వ‌చ్చిన పోలీసులు బ్యాగుల‌ను త‌నిఖీ చేశారు. అందులో ప్యాకింగ్ చేసిన గంజాయి వెలుగు చూసింది. ఈ ఘటన అల్లూరి జిల్లా డొంక‌రాయిలో చోటు చేసుకుంది.

దీంతో వారందరినీ అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరి వ‌ద్ద నుంచి 45 బ్యాగుల‌లో సుమారు ఆరు వందల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీటి విలువ బ‌హిరంగ మార్కెట్‌లో రూ. కోటి రూపాయలకు పైగా ఉంటుంద‌ని పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన వారిలో ఎనిమిది మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్నవారిలో ఒడిశా, రాజ‌స్దాన్, మ‌హారాష్ట్ర ఉత్తర్​ప్రదేశ్.. రాష్ట్రాల‌కు చెందినవార‌ు ఉన్నట్లు వెల్లడించారు. ఇలా బ్యాగులు మాటున గంజాయి త‌ర‌లించ‌డం అల‌వాట‌ని డొంక‌రాయి ఎస్ఐ ల‌క్ష్మీనారాయ‌ణ తెలిపారు.

Transporting Ganja in Alluri district: ఎప్పటిమాదిరిగానే పోలీసులు వాహ‌నాలు త‌నిఖీ చేశారు. ఆ ప్రాంతంలో సుమారు 11 మంది యువకులు వీధుల్లో సామాగ్రిని అమ్మడానికి వెళ్తున్నట్లు పోలీసుల‌కు తెలిపారు. అనుమానం వ‌చ్చిన పోలీసులు బ్యాగుల‌ను త‌నిఖీ చేశారు. అందులో ప్యాకింగ్ చేసిన గంజాయి వెలుగు చూసింది. ఈ ఘటన అల్లూరి జిల్లా డొంక‌రాయిలో చోటు చేసుకుంది.

దీంతో వారందరినీ అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరి వ‌ద్ద నుంచి 45 బ్యాగుల‌లో సుమారు ఆరు వందల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీటి విలువ బ‌హిరంగ మార్కెట్‌లో రూ. కోటి రూపాయలకు పైగా ఉంటుంద‌ని పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన వారిలో ఎనిమిది మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్నవారిలో ఒడిశా, రాజ‌స్దాన్, మ‌హారాష్ట్ర ఉత్తర్​ప్రదేశ్.. రాష్ట్రాల‌కు చెందినవార‌ు ఉన్నట్లు వెల్లడించారు. ఇలా బ్యాగులు మాటున గంజాయి త‌ర‌లించ‌డం అల‌వాట‌ని డొంక‌రాయి ఎస్ఐ ల‌క్ష్మీనారాయ‌ణ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.