ETV Bharat / state

Godavari flood: గుడారాల బతుకులు... గోదారి తెచ్చిన కష్టాలు ఇంకెన్నాళ్లు?

author img

By

Published : Sep 1, 2022, 10:01 AM IST

Godavari flood: గోదావరి ఉగ్రరూపం వారి జీవితాలను అతలాకుతలం చేసేసింది. వరదలు వారికి కొత్త కాకపోయినా... నెలల తరబడి ముంపు వెతలు గతంలో ఎన్నడూ అనుభవించలేదు. వరదలు వచ్చి నెలలు గడుస్తున్నా.. ముంపు తీవ్రత తగ్గలేదు.. మళ్లీ ఎప్పుడు వరద ముంచుకొస్తుందో తెలియదు.. వరద వచ్చిన ప్రతిసారీ ఎత్తు ప్రాంతాలకు పరుగెత్తలేక... నెలల తరబడి ఇళ్లకు దూరమవుతున్నారు. తాత్కాలికంగా వేసుకున్న గుడారాల్లో... కనీస వసతులకు కరవై.. పసిపిల్లలతో నరక యాతన అనుభవిస్తున్నారు.

Godavari flood
వరద కష్టాలు

Godavari flood: అల్లూరి జిల్లా కూనవరం మండలంలోని కొన్ని గ్రామాల పరిస్థితి దయనీయంగా ఉంది. శబరి కొత్తగూడెం పరిస్థితి మరీ దారుణం. గతంలో ఇక్కడ వరద వచ్చిన ప్రతిసారి నాలుగైదు రోజుల్లో తగ్గిపోయేది. ఈ ఏడాది మాత్రం 15 రోజులు గడిచినా వరద ముంపు తగ్గలేదు. చాలా ఇళ్లు వరదకు కొట్టుకుపోయాయి. మరికొన్ని బురదమయమయ్యాయి. వాటిని ఎలాగోలా శుభ్రం చేసుకుని ఉందామనుకునేంతలో మరోసారి గోదావరి ముంచుకొచ్చింది. మళ్లీ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. చేతికందిన సామగ్రి ట్రాక్టర్లపై వేసుకుని ఇలా పంద్రాజుపల్లిలోని ఎత్తయిన ప్రాంతంలో గుడారాలు వేసుకుని బతుకుబండి లాగిస్తున్నారు.

"గోదావరి వరదకు ఇళ్లు మొత్తం కొట్టుకుపోయాయి. ఇక్కడకు వచ్చేశాం. రెండు నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాం. రెండుసార్లు వరదలు వచ్చాయి. ఊరంతా వరద నీళ్లతో నిండిపోయింది. ఇక్కడ గుడారాలలో బతకడం చాలా కష్టంగా ఉంది. పిల్లలతో ఉంటున్నాం. దోమల, పాములు, తేళ్లు లాంటివి వస్తున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం. సమయానికి తినడానికి తిండి కూడా దొరకడంలేదు. కట్టెలు దొరినప్పుడు వండుకుని తింటున్నాం. మా బాధలు ఎవరికీ పట్టడంలేదు." -గ్రామస్తులు

వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో తెలియదు.. ఎన్నాళ్లిలా గుడారాల్లో తలదాచుకోవాలో తెలియదు.. ఎలా ఉన్నారు.. ఎలా బతుకుతున్నారని పలకరించిన నాథుడే లేడు.. కనీసం తాగునీటి సౌకర్యం లేదు. సాయంత్రమైతే విజృంభించే దోమలు... చంటి పిల్లలతో ఈ గుడారాల్లో శబరి కొత్తగూడెం వాసులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం.

"ఇక్కడ మావి ఒక ఇరవై కుటుంబాలు ఉన్నాయి. ఏ కట్టెలో, బుట్టలో తెచ్చుకుని వంట వండుకుని తింటున్నాం. చాలా బాధలు పడుతున్నాం. ఊర్లో వరదలకు అన్ని పడిపోయాయి. ప్రభుత్వం దయతలచి మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాం" -గ్రామస్తులు

కట్టుకున్న గూడు గోదారిలో కలసిపోయింది. మళ్ళీ కట్టుకుందామంటే వరద ఎప్పుడొస్తుందో తెలియని దుస్థితి. అందుకే శబరి కొత్తగూడెం వాసులు రెండు నెలలుగా ఇక్కడే తలదాచుకుంటున్నారు. పిల్లల చదువులు పాడైపోతున్నాయి. ప్రభుత్వం స్పందించి... నష్ట పరిహరం అందిస్తే.. ఎటైనా వెళ్లి బతుకుతామంటున్నారు శబరి కొత్తగూడెం గ్రామస్తులు.

"కట్టుకున్న గూడు గోదారిలో కలసిపోయింది. మళ్లీ కట్టుకుందామంటే వరద ఎప్పుడొస్తుందో తెలియని దుస్థితి. రెండు నెలలుగా ఇక్కడే తలదాచుకుంటున్నాం. పిల్లల చదువులు పాడైపోతున్నాయి. ప్రభుత్వం స్పందించి... నష్ట పరిహరం అందిస్తే.. ఎటైనా వెళ్లి బతుకుతాం" - శబరి కొత్తగూడెం గ్రామస్తులు

వరద కష్టాలు

ఇవీ చదవండి:

Godavari flood: అల్లూరి జిల్లా కూనవరం మండలంలోని కొన్ని గ్రామాల పరిస్థితి దయనీయంగా ఉంది. శబరి కొత్తగూడెం పరిస్థితి మరీ దారుణం. గతంలో ఇక్కడ వరద వచ్చిన ప్రతిసారి నాలుగైదు రోజుల్లో తగ్గిపోయేది. ఈ ఏడాది మాత్రం 15 రోజులు గడిచినా వరద ముంపు తగ్గలేదు. చాలా ఇళ్లు వరదకు కొట్టుకుపోయాయి. మరికొన్ని బురదమయమయ్యాయి. వాటిని ఎలాగోలా శుభ్రం చేసుకుని ఉందామనుకునేంతలో మరోసారి గోదావరి ముంచుకొచ్చింది. మళ్లీ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. చేతికందిన సామగ్రి ట్రాక్టర్లపై వేసుకుని ఇలా పంద్రాజుపల్లిలోని ఎత్తయిన ప్రాంతంలో గుడారాలు వేసుకుని బతుకుబండి లాగిస్తున్నారు.

"గోదావరి వరదకు ఇళ్లు మొత్తం కొట్టుకుపోయాయి. ఇక్కడకు వచ్చేశాం. రెండు నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాం. రెండుసార్లు వరదలు వచ్చాయి. ఊరంతా వరద నీళ్లతో నిండిపోయింది. ఇక్కడ గుడారాలలో బతకడం చాలా కష్టంగా ఉంది. పిల్లలతో ఉంటున్నాం. దోమల, పాములు, తేళ్లు లాంటివి వస్తున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం. సమయానికి తినడానికి తిండి కూడా దొరకడంలేదు. కట్టెలు దొరినప్పుడు వండుకుని తింటున్నాం. మా బాధలు ఎవరికీ పట్టడంలేదు." -గ్రామస్తులు

వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో తెలియదు.. ఎన్నాళ్లిలా గుడారాల్లో తలదాచుకోవాలో తెలియదు.. ఎలా ఉన్నారు.. ఎలా బతుకుతున్నారని పలకరించిన నాథుడే లేడు.. కనీసం తాగునీటి సౌకర్యం లేదు. సాయంత్రమైతే విజృంభించే దోమలు... చంటి పిల్లలతో ఈ గుడారాల్లో శబరి కొత్తగూడెం వాసులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం.

"ఇక్కడ మావి ఒక ఇరవై కుటుంబాలు ఉన్నాయి. ఏ కట్టెలో, బుట్టలో తెచ్చుకుని వంట వండుకుని తింటున్నాం. చాలా బాధలు పడుతున్నాం. ఊర్లో వరదలకు అన్ని పడిపోయాయి. ప్రభుత్వం దయతలచి మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాం" -గ్రామస్తులు

కట్టుకున్న గూడు గోదారిలో కలసిపోయింది. మళ్ళీ కట్టుకుందామంటే వరద ఎప్పుడొస్తుందో తెలియని దుస్థితి. అందుకే శబరి కొత్తగూడెం వాసులు రెండు నెలలుగా ఇక్కడే తలదాచుకుంటున్నారు. పిల్లల చదువులు పాడైపోతున్నాయి. ప్రభుత్వం స్పందించి... నష్ట పరిహరం అందిస్తే.. ఎటైనా వెళ్లి బతుకుతామంటున్నారు శబరి కొత్తగూడెం గ్రామస్తులు.

"కట్టుకున్న గూడు గోదారిలో కలసిపోయింది. మళ్లీ కట్టుకుందామంటే వరద ఎప్పుడొస్తుందో తెలియని దుస్థితి. రెండు నెలలుగా ఇక్కడే తలదాచుకుంటున్నాం. పిల్లల చదువులు పాడైపోతున్నాయి. ప్రభుత్వం స్పందించి... నష్ట పరిహరం అందిస్తే.. ఎటైనా వెళ్లి బతుకుతాం" - శబరి కొత్తగూడెం గ్రామస్తులు

వరద కష్టాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.