ETV Bharat / jagte-raho

హేమంత్‌ హత్య కేసు నిందితులకు ముగిసిన పోలీస్‌ కస్టడీ - పరవు హత్యలో ముగిసిన కస్టడీ తాజా వార్తలు

తెలంగాణలో సంచలనం సృష్టించిన హేమంత్‌ హత్య కేసులో నిందితులకు పోలీస్‌ కస్టడీ ముగిసింది. నిందితులు లక్ష్మారెడ్డి, యుగేందర్‌రెడ్డి పోలీస్‌ కస్టడీ ముగిసినట్లు మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.

హేమంత్‌ హత్య కేసు నిందితులకు ముగిసిన పోలీస్‌ కస్టడీ
హేమంత్‌ హత్య కేసు నిందితులకు ముగిసిన పోలీస్‌ కస్టడీ
author img

By

Published : Oct 5, 2020, 7:45 PM IST

హేమంత్ హత్య కేసులో పరారీలో ఉన్న నలుగురు నిందితులు ఎరుకల కృష్ణ, మహమ్మద్ పాషా, రాజు, సాయన్నను అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. హత్య తర్వాత మృతదేహంపై బంగారు నగలను కృష్ణ తీసుకెళ్లగా వాటిని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

ప్రేమ వివాహం నచ్చకే హేమంత్‌ను చంపినట్లు లక్ష్మారెడ్డి అంగీకరించాడని డీసీపీ తెలిపారు. మిగతా ఏడుగురిని కూడా కస్టడీకి తీసుకొని విచారిస్తామన్నారు. హత్య కేసులో అవంతి తమ్ముడు ఆశిశ్ పాత్ర లేదని ప్రాథమికంగా తేలినట్లు డీసీపీ పేర్కొన్నారు. హత్య కేసులో మరింతగా దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు.

హేమంత్ హత్య కేసులో పరారీలో ఉన్న నలుగురు నిందితులు ఎరుకల కృష్ణ, మహమ్మద్ పాషా, రాజు, సాయన్నను అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. హత్య తర్వాత మృతదేహంపై బంగారు నగలను కృష్ణ తీసుకెళ్లగా వాటిని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

ప్రేమ వివాహం నచ్చకే హేమంత్‌ను చంపినట్లు లక్ష్మారెడ్డి అంగీకరించాడని డీసీపీ తెలిపారు. మిగతా ఏడుగురిని కూడా కస్టడీకి తీసుకొని విచారిస్తామన్నారు. హత్య కేసులో అవంతి తమ్ముడు ఆశిశ్ పాత్ర లేదని ప్రాథమికంగా తేలినట్లు డీసీపీ పేర్కొన్నారు. హత్య కేసులో మరింతగా దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.