ETV Bharat / jagte-raho

సమన్వయ లోపం.. విద్యుదాఘాతంతో యువకుడు మృతి

author img

By

Published : Dec 8, 2020, 10:48 PM IST

సమన్వయ లోపంతో విద్యుత్ స్తంభంపై పనులు చేస్తున్న 22 ఏళ్ల యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా చిలుకలూరిపేటలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

chilakaluripet-guntur-district
chilakaluripet-guntur-district

గుంటూరు జిల్లా చిలుకలూరిపేట తాగునీటి చెరువు సమీపంలో విషాదం జరిగింది. సాయంత్రం విద్యుత్ స్తంభంపై పనులు చేస్తున్న సమయంలో విద్యుదా​ఘాతానికి గురై సాగర్(22) అనే యువకుడు మృతి చెందాడు. అధికారులు, పనులు నిర్వహిస్తున్న సబ్ కాంట్రాక్టర్​కు మధ్య విద్యుత్ ఎల్​సీ(లైన్ క్లియల్) విషయంలో అవగాహనలోపంతో ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న చిలుకలూరిపేట గ్రామీణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కుటుంబసభ్యుల ఆందోళన...

సాగర్ మృతి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని విద్యుత్ స్తంభంపైనే ఉంచాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కుటుంబసభ్యులతో మాట్లాడిన చిలుకలూరిపేట గ్రామీణ ఎస్ఐ భాస్కర్... న్యాయం జరిగేలా చూస్తామని నచ్చజెప్పటంతో మృతదేహాన్ని కిందికి దించారు.

గుంటూరు జిల్లా చిలుకలూరిపేట తాగునీటి చెరువు సమీపంలో విషాదం జరిగింది. సాయంత్రం విద్యుత్ స్తంభంపై పనులు చేస్తున్న సమయంలో విద్యుదా​ఘాతానికి గురై సాగర్(22) అనే యువకుడు మృతి చెందాడు. అధికారులు, పనులు నిర్వహిస్తున్న సబ్ కాంట్రాక్టర్​కు మధ్య విద్యుత్ ఎల్​సీ(లైన్ క్లియల్) విషయంలో అవగాహనలోపంతో ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న చిలుకలూరిపేట గ్రామీణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కుటుంబసభ్యుల ఆందోళన...

సాగర్ మృతి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని విద్యుత్ స్తంభంపైనే ఉంచాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కుటుంబసభ్యులతో మాట్లాడిన చిలుకలూరిపేట గ్రామీణ ఎస్ఐ భాస్కర్... న్యాయం జరిగేలా చూస్తామని నచ్చజెప్పటంతో మృతదేహాన్ని కిందికి దించారు.

ఇదీ చదవండి

ఏలూరు వింత వ్యాధి.. అస్వస్థతకు గురైన వారి సంఖ్య 561

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.