కడప జిల్లా కాశీనాయన మండలం నల్లమల అటవీప్రాంతంలో పోలీసులు భారీగా ఎర్రచందనం పట్టుకున్నారు. రవాణాకు సిద్ధంగా ఉంచిన సుమారు రూ. 3 కోట్ల విలువగల 94 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, రక్షకభటుల సాయంతో జ్యోతి క్షేత్రం చెలిమ బావి వద్ద దాడులు చేశారు. ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని.. లారీని సీజ్ చేశామని డీఎఫ్వో గురుప్రభాకర్ వెల్లడించారు. ఈ దోపిడీలో అంతర్జాతీయ స్మగ్లర్ల హస్తముందని అనుమానిస్తున్నామని తెలిపారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇవీ చదవండి..ఎర్రచందనం దుంగల లెక్కల్లో తేడా..విచారణకు ఆదేశం