ETV Bharat / crime

పట్టపగలే యువతులపై దాడి.. పట్టించుకోని పోలీసులు! - తెలంగాణ వార్తలు

దాడులు జరిగితే సహించేది లేదని చెప్పే పోలీసుల మాటలు అక్కడక్కడా నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో.. తమ ఇంట్లోకి 20మంది వచ్చి దాడి చేశారంటూ 100కు డయల్ చేశామని బాధిత యువతులు పేర్కొన్నారు. పోలీసులు వచ్చి.. చూసి ఏమీ పట్టించుకోకుండా వెళ్లిపోయారని వాపోయారు.

the-house-was-attacked-by-gopalakrishna-people-and-the-police-neglected-said-by-affected-women-in-karimnagar
పట్టపగలే యువతులపై దాడి.. పట్టించుకోని పోలీసులు..!
author img

By

Published : Feb 13, 2021, 7:08 PM IST

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​కు చెందిన గోపాలకృష్ణ అనే వ్యక్తి అనుచరులు.. తమ ఇంటిపై దాడి చేశారంటూ కరీంనగర్ జిల్లా సుభాష్​నగర్​కు చెందిన యువతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సామాగ్రిని బయట పడేసి.. తమను చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. నామమాత్రంగా వచ్చి ఏమీ పట్టించుకోకుండా వెళ్లిపోయారని వాపోయారు. తమకు సహాయం చేయండంటూ బతిమిలాడడం.. స్థానికులను కంటతడి పెట్టించింది.

2013లో కరీంనగర్​కు చెందిన చిగురు అనిల్ వద్ద రూ. 15 లక్షలతో ఇల్లు కొనుగోలు చేశాం. అప్పటి నుంచి అదే ఇంట్లో ఉంటున్నాం. హైదరాబాద్​కు చెందిన గోపాలకృష్ణ ఆ ఇంటిని కొనుగోలు చేశానంటూ.. గూండాలతో కలిసి పలు మార్లు మా ఇంటిపై దాడులు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడం లేదు.

- బాధిత యువతులు

తమపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాధిత యువతులు కోరుతున్నారు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారు ఘటనపై దర్యాప్తు చేయకపోవడం గమనార్హం.

ఇదీ చూడండి: పదమూడేళ్ల బాలికపై అత్యాచారం

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​కు చెందిన గోపాలకృష్ణ అనే వ్యక్తి అనుచరులు.. తమ ఇంటిపై దాడి చేశారంటూ కరీంనగర్ జిల్లా సుభాష్​నగర్​కు చెందిన యువతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సామాగ్రిని బయట పడేసి.. తమను చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. నామమాత్రంగా వచ్చి ఏమీ పట్టించుకోకుండా వెళ్లిపోయారని వాపోయారు. తమకు సహాయం చేయండంటూ బతిమిలాడడం.. స్థానికులను కంటతడి పెట్టించింది.

2013లో కరీంనగర్​కు చెందిన చిగురు అనిల్ వద్ద రూ. 15 లక్షలతో ఇల్లు కొనుగోలు చేశాం. అప్పటి నుంచి అదే ఇంట్లో ఉంటున్నాం. హైదరాబాద్​కు చెందిన గోపాలకృష్ణ ఆ ఇంటిని కొనుగోలు చేశానంటూ.. గూండాలతో కలిసి పలు మార్లు మా ఇంటిపై దాడులు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడం లేదు.

- బాధిత యువతులు

తమపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాధిత యువతులు కోరుతున్నారు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారు ఘటనపై దర్యాప్తు చేయకపోవడం గమనార్హం.

ఇదీ చూడండి: పదమూడేళ్ల బాలికపై అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.