ETV Bharat / city

ఉత్తరాంధ్ర సత్యం గల తల్లి...ఎరుకుమాంబ

author img

By

Published : Oct 25, 2020, 7:02 PM IST

ఎక్కడైనా అమ్మవారికి.... చీర, పళ్లు, పంచబక్ష పరమాన్నాలను... మొక్కుకుంటారు. కానీ విశాఖలో ఎరుకుమాంబ అమ్మ వారికి నీళ్లు మొక్కుకుంటే చాలు.... అడిగిన వరాలు తీరుస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం. మూడో శతాబ్దం నుంచి ఇక్కడ కొలువైన అమ్మవారి విగ్రహానికి శిరస్సు ఉండదు. ఈమె శిరస్సు కాళ్ళ వద్ద ఉంటుంది. అమ్మవారికి వెనుక భాగంలో శ్రీచక్రం ఉందని భక్తులు చెబుతారు. ఉత్తరాంధ్ర సత్యం గల తల్లిగా ఈ ఎరుకమాంబను భక్తులు కొలుస్తారు.

yerukumamba-temple-in-visakha
ఎరుకుమాంబ అమ్మవారు
ఎరుకుమాంబ అమ్మవారు

అక్కడ కొలువైన అమ్మవారికి శిరస్సు ఉండదు...ఆ స్థానంలో ఓంకారం ఉంటుంది. ఆ దేవతే విశాఖ దొండపర్తిలో కొలువైన ఎరుకుమాంబ. ఈ అమ్మవారు గౌరీ స్వరూపం. ఏడో శతాబ్దం నుంచి అమ్మ కొలువైయ్యారని స్థల పురాణం చెబుతోంది. ఈమె శిరస్సు కాళ్ల వద్ద ఉంటుంది. అమ్మవారికి వెనుక భాగంలో శ్రీచక్రం ఉందని భక్తుల విశ్వాసం. ఎక్కడైనా కొబ్బరికాయలు కొడతారు లేదా చీరో, పళ్ళు నివేదిస్తారు. కానీ ఇక్కడ అమ్మవారికి నీళ్ళు మొక్కుకుంటారు. అనుకున్న కోరిక తిరగానే నీళ్లను పోసి మొక్కు తీర్చుకుంటారు. ఉత్తరాంధ్ర సత్యం గల తల్లిగా ఎరుకమాంబను కొలుస్తారు.

ప్రస్తుతం రైల్వే స్టేషన్ ప్రక్కనే ఉన్న వైర్ లెస్ కాలనీలో మూడో శతాబ్దం నుంచి ఎరుకుమాంబ అమ్మవారు పూజలు అందుకునేవారు. అయితే రైల్వే స్టేషన్ నిర్మాణ సమయంలో గ్రామాన్ని ఖాళీ చేయించారు. ఆ సమయంలో అమ్మవారిని భక్తులు అక్కడే వదిలేసి వచ్చేశారు. భక్తులు ఎక్కడ ఉంటారో.. తాను అక్కడే ఉంటానని కలలో కనిపించి అమ్మవారు చెప్పినట్లు భక్తులు చెబుతారు. దేవత విగ్రహం ఎద్దుల బండి మీద పెట్టి తీసుకొస్తుంటే... ఆగిన చోట ఆలయం కట్టి విగ్రహం పెట్టాలని అనుకుంటున్న సమయంలో విగ్రహం నుంచి శిరస్సు వేరుపడింది. వేరు పడిన అమ్మవారి శిరస్సు అతికించిన నిలవలేదు ...మళ్ళీ భక్తులు అమ్మవారిని కొలవగా... శిరస్సు కాళ్ళ దగ్గరే పెట్టి, కంఠానికి నీళ్లు పోస్తే.. చల్లగా చూస్తానని ఎరుకుమాంబ చెప్పినట్లు భక్తులు తెలిపారు. అలా నీళ్లు పోసి మొక్కులు తీర్చుకుంటున్నారు విశాఖ వాసులు. అయితే కరోనా సమయంలో భక్తులు ఈ అవకాశాన్ని అందరూ పొందలేకపోవడంతో బాధ పడుతున్నారు.

ఇదీ చదవండి:

రేపటి నుంచి శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ

ఎరుకుమాంబ అమ్మవారు

అక్కడ కొలువైన అమ్మవారికి శిరస్సు ఉండదు...ఆ స్థానంలో ఓంకారం ఉంటుంది. ఆ దేవతే విశాఖ దొండపర్తిలో కొలువైన ఎరుకుమాంబ. ఈ అమ్మవారు గౌరీ స్వరూపం. ఏడో శతాబ్దం నుంచి అమ్మ కొలువైయ్యారని స్థల పురాణం చెబుతోంది. ఈమె శిరస్సు కాళ్ల వద్ద ఉంటుంది. అమ్మవారికి వెనుక భాగంలో శ్రీచక్రం ఉందని భక్తుల విశ్వాసం. ఎక్కడైనా కొబ్బరికాయలు కొడతారు లేదా చీరో, పళ్ళు నివేదిస్తారు. కానీ ఇక్కడ అమ్మవారికి నీళ్ళు మొక్కుకుంటారు. అనుకున్న కోరిక తిరగానే నీళ్లను పోసి మొక్కు తీర్చుకుంటారు. ఉత్తరాంధ్ర సత్యం గల తల్లిగా ఎరుకమాంబను కొలుస్తారు.

ప్రస్తుతం రైల్వే స్టేషన్ ప్రక్కనే ఉన్న వైర్ లెస్ కాలనీలో మూడో శతాబ్దం నుంచి ఎరుకుమాంబ అమ్మవారు పూజలు అందుకునేవారు. అయితే రైల్వే స్టేషన్ నిర్మాణ సమయంలో గ్రామాన్ని ఖాళీ చేయించారు. ఆ సమయంలో అమ్మవారిని భక్తులు అక్కడే వదిలేసి వచ్చేశారు. భక్తులు ఎక్కడ ఉంటారో.. తాను అక్కడే ఉంటానని కలలో కనిపించి అమ్మవారు చెప్పినట్లు భక్తులు చెబుతారు. దేవత విగ్రహం ఎద్దుల బండి మీద పెట్టి తీసుకొస్తుంటే... ఆగిన చోట ఆలయం కట్టి విగ్రహం పెట్టాలని అనుకుంటున్న సమయంలో విగ్రహం నుంచి శిరస్సు వేరుపడింది. వేరు పడిన అమ్మవారి శిరస్సు అతికించిన నిలవలేదు ...మళ్ళీ భక్తులు అమ్మవారిని కొలవగా... శిరస్సు కాళ్ళ దగ్గరే పెట్టి, కంఠానికి నీళ్లు పోస్తే.. చల్లగా చూస్తానని ఎరుకుమాంబ చెప్పినట్లు భక్తులు తెలిపారు. అలా నీళ్లు పోసి మొక్కులు తీర్చుకుంటున్నారు విశాఖ వాసులు. అయితే కరోనా సమయంలో భక్తులు ఈ అవకాశాన్ని అందరూ పొందలేకపోవడంతో బాధ పడుతున్నారు.

ఇదీ చదవండి:

రేపటి నుంచి శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.