ETV Bharat / city

'కుటుంబ సర్వేలో ఆదివాసీ ఎంపిక విధానం రద్దు చేయాలి'

author img

By

Published : Nov 23, 2020, 9:46 PM IST

విశాఖ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సర్వేలో మతం కాలమ్ చేర్చడంపై ఎమ్మెల్సీ మాధవ్ అభ్యంతరం తెలిపారు. ఆదివాసీని ఓ మతంగా చేర్చడమేంటని ప్రశ్నించిన ఆయన... గిరిజనులు హిందువుల్లో భాగమేనన్నారు. ఆదివాసీల్లో విభజన చేయడం మానుకోవాలని సూచించారు.

Mlc madhav
Mlc madhav

విశాఖ గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం చేస్తున్న కుటుంబసర్వేలో మతం నమోదు కాలమ్ పెట్టడాన్ని భాజపా నేత, ఎమ్మెల్సీ మాధవ్ తప్పుబట్టారు. విశాఖ భాజపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ఆదివాసీ ఓ మతంగా కాలమ్ ఇచ్చారన్నారు. గిరిజనులు హిందువుల్లో భాగమేనని మాధవ్ స్పష్టం చేశారు. కానీ అలా కాదని ఇప్పుడు ఆదివాసీ మతాన్ని కొత్తగా తెస్తున్నారని ఆవేదన చెందారు.

ఆ సర్వేలో మత అంశాలను తేవడం సరికాదని మాధవ్ అన్నారు. ఆదివాసీల్లో విభజన చేయడం మానుకోవాలన్నారు. కుటుంబ సర్వేలో ఆదివాసీ అని ఎంపిక చేసుకునే విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

విశాఖ గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం చేస్తున్న కుటుంబసర్వేలో మతం నమోదు కాలమ్ పెట్టడాన్ని భాజపా నేత, ఎమ్మెల్సీ మాధవ్ తప్పుబట్టారు. విశాఖ భాజపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ఆదివాసీ ఓ మతంగా కాలమ్ ఇచ్చారన్నారు. గిరిజనులు హిందువుల్లో భాగమేనని మాధవ్ స్పష్టం చేశారు. కానీ అలా కాదని ఇప్పుడు ఆదివాసీ మతాన్ని కొత్తగా తెస్తున్నారని ఆవేదన చెందారు.

ఆ సర్వేలో మత అంశాలను తేవడం సరికాదని మాధవ్ అన్నారు. ఆదివాసీల్లో విభజన చేయడం మానుకోవాలన్నారు. కుటుంబ సర్వేలో ఆదివాసీ అని ఎంపిక చేసుకునే విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి :

25 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.