ETV Bharat / city

వైకాపా ఏడాది పాలనపై 'మన పాలన- మీ సూచన'

వైకాపా అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తైన సందర్భంగా ప్రభుత్వం 'మన పాలన- మీ సూచన' పేరిట కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఏడాది కాలంలో చేపట్టిన పథకాలు, కార్యక్రమాలపై రాష్ట్ర జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

author img

By

Published : May 25, 2020, 12:02 AM IST

వైకాపా ఏడాది పాలనపై 'మన పాలన- మీ సూచన' కార్యక్రమం !
వైకాపా ఏడాది పాలనపై 'మన పాలన- మీ సూచన' కార్యక్రమం !

వైకాపా పాలన ఏడాది పూర్తైన సందర్భంగా నేటి నుంచి మే 30 తేదీ వరకు రాష్ట్ర, జిల్లాస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 'మన పాలన- మీ సూచన' పేరిట మేధోమథన కార్యక్రమం నిర్వహించనున్నారు.

రాష్ట్ర స్థాయిలో సోమవారం గ్రామ, వార్డు సచివాలయల వ్యవస్థపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనున్నారు. సీఎం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమం లైవ్ టెలికాస్ట్​ను జిల్లాలకు ప్రసారం చేయనున్నారు.

జిల్లా మంత్రులు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 25న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, 26న వ్యవసాయ అనుబంధ రంగాలు, 27న విద్యారంగంలో సంస్కరణలు , 28 న మౌలిక సదుపాయాలు, నైపుణ్యం, గృహనిర్మాణం, 29న ఆరోగ్యం వంటి అంశాలపై కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ నెల 30 తేదీన ముఖ్యమంత్రి జగన్ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిచనున్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమాల్లో 50 మందికి మించి హాజరు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

వైకాపా పాలన ఏడాది పూర్తైన సందర్భంగా నేటి నుంచి మే 30 తేదీ వరకు రాష్ట్ర, జిల్లాస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 'మన పాలన- మీ సూచన' పేరిట మేధోమథన కార్యక్రమం నిర్వహించనున్నారు.

రాష్ట్ర స్థాయిలో సోమవారం గ్రామ, వార్డు సచివాలయల వ్యవస్థపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనున్నారు. సీఎం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమం లైవ్ టెలికాస్ట్​ను జిల్లాలకు ప్రసారం చేయనున్నారు.

జిల్లా మంత్రులు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 25న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, 26న వ్యవసాయ అనుబంధ రంగాలు, 27న విద్యారంగంలో సంస్కరణలు , 28 న మౌలిక సదుపాయాలు, నైపుణ్యం, గృహనిర్మాణం, 29న ఆరోగ్యం వంటి అంశాలపై కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ నెల 30 తేదీన ముఖ్యమంత్రి జగన్ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిచనున్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమాల్లో 50 మందికి మించి హాజరు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.