విజయవాడలో ట్రెండ్ సెట్కి వెంకీమామ చిత్రబృందం రావడంతో సందడి నెలకొంది. వెంకీమామ చిత్రం విజయవంతం కావడంపై చిత్ర బృందమంతా ఆనందం వ్యక్తం చేశారు. అక్కినేని నాగచైతన్యతో తాను కలిసి నటించాలనే తన తండ్రి రామానాయుడు కోరిక ఈ సినిమాతో విజయవంతం అయిందని హీరో వెంకటేశ్ చెప్పారు. విజయవాడలో వరుసగా 60 ఆటలు హౌస్ఫుల్ కలెక్షన్లతో ఆడటం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కుటుంబ చిత్రంగా ప్రేక్షకులు మళ్లీ మళ్లీ ఈ సినిమా చూడటమే ఈ చిత్ర విజయానికి కారణమన్నారు. మహేష్బాబుతో సినిమా చేశానని, ఇప్పుడు చైతన్యతో, భవిష్యత్తులో అందరి హీరోలతో కలిసి నటిస్తానని వెంకటేశ్ చెప్పారు. విజయోత్సవ సందర్భ కార్యక్రమాలు ఎప్పుడూ హైదరాబాద్లోనే నిర్వహించడం జరుగుతుందని... ఈ సినిమా సక్సెస్ మీట్ విజయవాడలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని నాగచైతన్య అన్నారు. ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో ఆడటంపై ప్రేక్షకులకు ముఖ్యంగా వెంకటేశ్, అక్కినేని అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కథానాయిక పాయల్ రాజ్పుత్ ఆనందం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి...2019: గ్యాప్ తీసుకున్నారా.. వచ్చిందా..?