ETV Bharat / city

PROTEST: ప్రైవేటు పాఠశాలలను కాపాడాలంటూ నిరసన

author img

By

Published : Sep 5, 2021, 3:25 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాల గురించి ఆలోచించాలని ఫెడరేషన్ ఆఫ్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. జీవో నెం: 53 తమకు శాపంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

PROTEST
PROTEST

ప్రైవేటు పాఠశాలలు, ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ విజయవాడలో 'ఫెడరేషన్ ఆఫ్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్' ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు- 53 తమ పట్ల శాపంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఉపాధిని కాపాడాలని కోరారు.

పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు.. నాణ్యమైన విద్య అందిస్తున్న ప్రైవేటు పాఠశాలలు మూతపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే ఆయా పాఠశాలలను వేధింపులకు గురిచేస్తూ భయపెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని ఫీజు విధానం, ఇతర అంశాలపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.

ప్రైవేటు పాఠశాలలు, ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ విజయవాడలో 'ఫెడరేషన్ ఆఫ్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్' ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు- 53 తమ పట్ల శాపంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఉపాధిని కాపాడాలని కోరారు.

పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు.. నాణ్యమైన విద్య అందిస్తున్న ప్రైవేటు పాఠశాలలు మూతపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే ఆయా పాఠశాలలను వేధింపులకు గురిచేస్తూ భయపెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని ఫీజు విధానం, ఇతర అంశాలపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

Pensions: అందని భరోసా పింఛన్లు.. వృద్ధుల అవస్థలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.