ETV Bharat / city

తెలంగాణ:హత్యకు దారి తీసిన వివాహేతర సంబంధం - నిర్మల్ జిల్లా తాజా క్రైమ్​ వార్తలు

ఓ వ్యక్తి రెండు పెళ్లిళ్లు అయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆమెతో మంగళవారం రాత్రి గొడవ జరిగింది. తర్వాత ఆ మహిళ ఇతరులతో సన్నిహితంగా ఉన్నట్లు అనుమానించిన వ్యక్తి.. ఆమెపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటన తెలంగాణ నిర్మల్ జిల్లాలో జరిగింది.

the marital affair led to the murder at nirmal district
తెలంగాణ:హత్యకు దారి తీసిన వివాహేతర సంబంధం
author img

By

Published : Dec 9, 2020, 7:55 AM IST

కొద్ది రోజులుగా సహజీవనం చేస్తున్న ఓ జంట.. వారి వివాహేతర సంబంధమే వారి ప్రాణాల మీదకు తెచ్చి పెట్టింది. ఈ ఘటన తెలంగాణ నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోంద్రాట్​లో చోటుచేసుకుంది. తానూర్ మండలంలోని బోంద్రాట్​కు చెందిన కేరబాయికి రెండు పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భర్త మృతి చెందడంతో రెండో వివాహం చేసుకుంది. రెండో భర్త కూడా మృతి చెందడంతో ఇద్దరు కుమార్తెలతో ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో అదే మండలానికి చెందిన బోసి గ్రామానికి చెందిన లక్ష్మణ్​తో పరిచయం ఏర్పడింది.

లక్ష్మణ్​కు భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ.. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత నాలుగేళ్లుగా వీరి సంబంధం కొనసాగుతుంది. కేరాబాయితో లక్ష్మణ్​కు మంగళవారం రాత్రి గొడవ జరిగింది. కేరాబాయి ఇతరులతో సన్నిహితంగా ఉన్నట్లు అనుమానించిన లక్ష్మణ్.. ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

గమనించిన గ్రామస్థులు ఆగ్రహంతో లక్ష్మణ్​ను చితక బాదారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన లక్ష్మణ్​ను పోలీసులు భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై రాజన్న తెలిపారు.

కొద్ది రోజులుగా సహజీవనం చేస్తున్న ఓ జంట.. వారి వివాహేతర సంబంధమే వారి ప్రాణాల మీదకు తెచ్చి పెట్టింది. ఈ ఘటన తెలంగాణ నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోంద్రాట్​లో చోటుచేసుకుంది. తానూర్ మండలంలోని బోంద్రాట్​కు చెందిన కేరబాయికి రెండు పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భర్త మృతి చెందడంతో రెండో వివాహం చేసుకుంది. రెండో భర్త కూడా మృతి చెందడంతో ఇద్దరు కుమార్తెలతో ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో అదే మండలానికి చెందిన బోసి గ్రామానికి చెందిన లక్ష్మణ్​తో పరిచయం ఏర్పడింది.

లక్ష్మణ్​కు భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ.. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత నాలుగేళ్లుగా వీరి సంబంధం కొనసాగుతుంది. కేరాబాయితో లక్ష్మణ్​కు మంగళవారం రాత్రి గొడవ జరిగింది. కేరాబాయి ఇతరులతో సన్నిహితంగా ఉన్నట్లు అనుమానించిన లక్ష్మణ్.. ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

గమనించిన గ్రామస్థులు ఆగ్రహంతో లక్ష్మణ్​ను చితక బాదారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన లక్ష్మణ్​ను పోలీసులు భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై రాజన్న తెలిపారు.

ఇదీ చూడండి :

ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.