ETV Bharat / city

Protest: ఆర్టీసీ కారుణ్య నియామకాల్లో అన్యాయం జరుగుతోందంటూ ఆందోళన

కారుణ్య నియామకాలలో అన్యాయం జరుగుతోందంటూ ఆర్టీసీలోని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. సీనియారిటీ ప్రకారం కాకుండా అక్రమంగా నియామకాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ.. విజయవాడ పండిట్ నెహ్రూ బస్​స్టేషన్​లోని ఆర్టీసీ ఎండీ కార్యాలయం ఎదుట విధుల్లో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు.

author img

By

Published : Feb 14, 2022, 2:19 PM IST

ఆర్టీసీ కారుణ్య నియామకాల్లో అన్యాయం జరుగుతోందంటూ ఆందోళన
ఆర్టీసీ కారుణ్య నియామకాల్లో అన్యాయం జరుగుతోందంటూ ఆందోళన

కారుణ్య నియామకాలలో అన్యాయం జరుగుతోందంటూ ఆర్టీసీలోని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్​స్టేషన్​లోని ఆర్టీసీ ఎండీ కార్యాలయం ఎదుట విధుల్లో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. సీనియారిటీ ప్రకారం కాకుండా అక్రమంగా నియామకాలు చేపడుతున్నారని ఆరోపించారు.

2016-19 మధ్య విధుల్లో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబసభ్యులకు కాకుండా 2020-21 వారికి ముందు ఉద్యోగాలు కల్పిస్తున్నారన్నారు. 2016-19 మధ్య కారుణ్య నియామకం పొందవలసిన వాళ్లు 725 మందికిపైగా ఉన్నారని ఆందోళనకారులు చెబుతున్నారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన పోలీసులతో కారుణ్య నియామక ఉద్యోగార్థులు వాగ్వాదానికి దిగారు.

కారుణ్య నియామకాలలో అన్యాయం జరుగుతోందంటూ ఆర్టీసీలోని వివిధ శాఖలకు చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్​స్టేషన్​లోని ఆర్టీసీ ఎండీ కార్యాలయం ఎదుట విధుల్లో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. సీనియారిటీ ప్రకారం కాకుండా అక్రమంగా నియామకాలు చేపడుతున్నారని ఆరోపించారు.

2016-19 మధ్య విధుల్లో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబసభ్యులకు కాకుండా 2020-21 వారికి ముందు ఉద్యోగాలు కల్పిస్తున్నారన్నారు. 2016-19 మధ్య కారుణ్య నియామకం పొందవలసిన వాళ్లు 725 మందికిపైగా ఉన్నారని ఆందోళనకారులు చెబుతున్నారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన పోలీసులతో కారుణ్య నియామక ఉద్యోగార్థులు వాగ్వాదానికి దిగారు.

ఇదీ చదవండి

బైకుల చోరీకి దుండగుల విఫలయత్నం... సీసీ కెమెరాల్లో రికార్డ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.