construction workers: విజయవాడలో భవన నిర్మాణ కార్మికుల తలపెట్టిన చలో అసెంబ్లీని పోలీసులు భగ్నం చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భవన నిర్మాణ కార్మికులు..హనుమాన్పేట దాసరి భవన్ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా బయల్దేరారు. మార్గమధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు.
వారిని అరెస్టు చేసి బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీసు స్టేషన్కు తరలించారు. తమకు రావాల్సిన నిధులు వెంటనే ఇవ్వాలని.. మళ్లించిన నిధులను వెంటనే జమ చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
Lock to Village Secretariat: బిల్లులు చెలించలేదని గ్రామ సచివాలయానికి తాళం..!