ETV Bharat / city

'ఆ విధంగా చేయడం సీఎం జగన్ అసమర్ధత'

author img

By

Published : Nov 13, 2020, 12:38 PM IST

ముఖ్యమంత్రి జగన్​పై ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని దివాలా తీయించేందుకు కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు. బహిరంగ మార్కెట్​లో ఎక్కువ ధర పలికే భూములను తక్కువకు వేలం వేయడం కుట్రపూరితమని మండిపడ్డారు.

gownivari srinivasulu
గౌనివారి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ

అప్పు తెచ్చి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయటం జగన్ అసమర్థతకు నిదర్శనమని ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు విమర్శించారు. భవిష్యత్తు తరాల కోసం వినియోగించాల్సిన భూములు అమ్ముతూ రాష్ట్రాన్ని సోల్డ్ ఏపీగా మారుస్తున్నారని దుయ్యబట్టారు . పింఛను, రేషను కావాలంటే ప్రజలు ఉన్న ఆస్తులు అమ్ముకోవాలనే విధంగా ప్రభుత్వ తీరుందని మండిపడ్డారు.

రాష్ట్రాన్ని దివాలా తీయించేందుకు జగన్ కంకణం కట్టుకున్నారని శ్రీనివాసులు ధ్వజమెత్తారు. విశాఖ, గుంటూరుల్లో విలువైన భూములు సొంతవారికి విక్రయించేలా కుట్రపన్నారని ఆరోపించారు. నగరం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ స్థలాలను కారుచౌకగా సొంత పార్టీ నేతలకు కట్టబెడుతూ పేదలకు పనికిరాని భూములు కేటాయించటం దేనికి సంకేతమని నిలదీశారు. బహిరంగ మార్కెట్​లో ఎక్కువ ధర పలికే విశాఖ పరిశ్రమల స్థాపన భూమి, గుంటూరులో ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి ఉద్దేశించిన భూములను రిజర్వ్ ధరకంటే తక్కువగా పేర్కొని వేలం వేయటం కుట్రపూరితమేనని ఆరోపించారు.

అప్పు తెచ్చి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయటం జగన్ అసమర్థతకు నిదర్శనమని ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు విమర్శించారు. భవిష్యత్తు తరాల కోసం వినియోగించాల్సిన భూములు అమ్ముతూ రాష్ట్రాన్ని సోల్డ్ ఏపీగా మారుస్తున్నారని దుయ్యబట్టారు . పింఛను, రేషను కావాలంటే ప్రజలు ఉన్న ఆస్తులు అమ్ముకోవాలనే విధంగా ప్రభుత్వ తీరుందని మండిపడ్డారు.

రాష్ట్రాన్ని దివాలా తీయించేందుకు జగన్ కంకణం కట్టుకున్నారని శ్రీనివాసులు ధ్వజమెత్తారు. విశాఖ, గుంటూరుల్లో విలువైన భూములు సొంతవారికి విక్రయించేలా కుట్రపన్నారని ఆరోపించారు. నగరం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ స్థలాలను కారుచౌకగా సొంత పార్టీ నేతలకు కట్టబెడుతూ పేదలకు పనికిరాని భూములు కేటాయించటం దేనికి సంకేతమని నిలదీశారు. బహిరంగ మార్కెట్​లో ఎక్కువ ధర పలికే విశాఖ పరిశ్రమల స్థాపన భూమి, గుంటూరులో ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి ఉద్దేశించిన భూములను రిజర్వ్ ధరకంటే తక్కువగా పేర్కొని వేలం వేయటం కుట్రపూరితమేనని ఆరోపించారు.

ఇవీ చదవండి..

జాలర్లకు చిక్కిన 10అడుగుల కొండచిలువ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.